📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Hyderabad:మీర్‌పేట హత్య కేసు వెలుగులోకి మరిన్ని సంచలన విషయాలు

Author Icon By Anusha
Updated: March 26, 2025 • 10:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ లో సంచలనం సృష్టించిన మీర్‌పేట హత్యకేసు తాజాగా మరో మలుపు తిరిగింది. గురుమూర్తి తన భార్య వెంకట మాధవిని హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి, అన్ని ఆధారాలు తుడిచిపెట్టివేయాలని చేసిన ప్రయత్నం విఫలమైంది. పోలీసులు తాజాగా డీఎన్‌ఏ రిపోర్టును అందుకున్నారు.రాచకొండ పోలీసులు కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు అప్పగించి, నిందితుడికి త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నారు.

డిఎన్‌ఏ రిపోర్ట్

హత్య జరిగిన ఇంట్లో రక్తం చుక్క,వెంట్రుక పోలీసులు ఆధారాలు సేకరించారు. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపగా, మాధవి పిల్లల డీఎన్‌ఏతో మ్యాచ్ అయ్యింది . దీని ఆధారంగా నిందితుడు గురుమూర్తి హత్యకు పాల్పడినట్లు శాస్త్రీయంగా నిర్ధారణ అయ్యింది .

హత్య కేసు

వెంకట మాధవి హత్య కేసులో నిందితుడు గురుమూర్తికి ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదని జనవరి 28న రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. కేసు దర్యాప్తులో ఆధారాలు సేకరించేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని సీపీ అన్నారు. ఈ కేసు విచారణ చేస్తున్న సమయంలో నివ్వెరపోయామన్నారు. క్షణికావేశంలో చేసిన హత్య కాదని పథకం ప్రకారమే హత్య చేశాడని అన్నారు. గురుమూర్తి స్వతహాగానే క్రూరుడని ఆయన వివరించారు.సంక్రాంతి పండగకు మాధవి, గురుమూర్తి తమ పిల్లల్ని తీసుకుని బంధువుల ఇంటికి వెళ్లారని సీపీ సుధీర్ బాబు అన్నారు. 15న పిల్లల్ని బంధువుల ఇంటి వద్దే వదిలేసి వెంకటమాధవి, గురుమూర్తి రాత్రి 10.41 గంటలకు ఇంటికి చేరుకున్నట్లు సీసీటీవీ ఫుటేజ్​లో గుర్తించామన్నారు. 16న ఉదయం 8 గంటలకు ఆమెతో అకారణంగా గొడవ పెట్టుకొని మాధవి తలను గోడకేసి కొట్టి కింద పడిపోయిన తర్వాత గొంతు నులిమి హతమార్చాడని దర్యాప్తులో తేలిందని తెలిపారు.

మృతదేహాన్ని ముక్కలు చేసి

కత్తితో కాళ్లు, చేతులు, శరీరం, తల నాలుగు భాగాలుగా కట్ చేశాడని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్ర గంటల వరకూ మృతదేహాన్ని ముక్కలు చేసినట్టు గుర్తించామని సీపీ తెలిపారు. వాటర్ హీటర్ నీళ్లు మరిగించి శరీర భాగాలను ఉడక బెట్టాడని, ఆ తర్వాత వాటిని స్టవ్​పై పెట్టి కాల్చాడని, రోకలి బండతో ఆ భాగాలను దంచి పొడి చేశాడని, ఆ పొడిని ప్లాస్టిక్ బకెట్​లో తీసుకెళ్లి జిల్లెలగూడ చెరువులో పోశాడని విచారణలో తెలిందని చెప్పారు.

మిస్సింగ్ కేసు

ముందుగా ఈ కేసునుపోలీసులు తొలుత మిస్సింగ్‌ కేసుగానే పరిగణించి దర్యాప్తు చేపట్టగా, గురుమూర్తి ప్రవర్తనపై అనుమానం వచ్చి దృఢమైన విచారణ చేపట్టారు. అతన్ని కఠినంగా ప్రశ్నించగా, తానే హత్య చేశానని, ఆధారాలు దొరికితే అరెస్టు చేసుకోమని పోలీసులను సవాల్ చేశాడు.దీంతో పోలీసులు హత్య జరిగిన ఇంట్లో ఆధారాల కోసం దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. వారు అనుకున్నట్లుగానే ఓ మూల రక్తపు చుక్క, టిష్యూ, వెంట్రుక లభించాయి. వీటిని ఫోరెన్సిక్ పరీక్షలు చేయగా, మాధవి పిల్లల డీఎన్‌ఏతో 100% మ్యాచ్ అయ్యింది.

#crimenews #DNAReport #HyderabadCrime #JusticeForMadhavi #MirpetMurderCase #PoliceInvestigation Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.