📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

Telugu News: Sarpanch Elections: మూడో దశ పోలింగ్ నేడు..ఫలితాలపై ఉత్కంఠ

Author Icon By Pooja
Updated: December 17, 2025 • 10:53 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల( Sarpanch Elections) ప్రక్రియ నేటితో ముగియనుంది. తొలి రెండు దశలు విజయవంతంగా పూర్తవ్వగా, చివరిదైన మూడో దశ పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ దశలో మొత్తం 53,06,395 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 26,01,861 మంది పురుషులు, 27,04,394 మంది మహిళలు, 140 మంది ఇతరులు ఉన్నారు. పోలింగ్ కోసం 36,452 కేంద్రాలు ఏర్పాటు చేయగా, 43,856 బ్యాలెట్ బాక్సులు(Ballot boxes) సిద్ధం చేశారు.

Read Also: TG Panchayat Elections: మూడవ విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం

Sarpanch Elections

3,752 సర్పంచ్ పదవులకు పోటీ

మూడో దశలో 182 మండలాల్లోని 4,159 గ్రామ పంచాయతీలకు( Sarpanch Elections) నోటిఫికేషన్ జారీ అయింది. ఏకగ్రీవ ఎన్నికలు, నామినేషన్లు దాఖలు కానివి, కోర్టు స్టేలు వంటి కారణాలతో మిగిలిన 3,752 సర్పంచ్ పదవులకు ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ స్థానాలకు 12,652 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 28,410 వార్డులకు గాను 75,725 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

ఎన్నికల నిర్వహణకు భారీ ఏర్పాట్లు

ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు 4,502 మంది రిటర్నింగ్ అధికారులు, 77,618 మంది పోలింగ్ సిబ్బంది, 2,489 మంది మైక్రో అబ్జర్వర్లు విధుల్లో ఉన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల నియమావళి అమలులో భాగంగా ఇప్పటివరకు 36,165 మందిని బైండోవర్ చేయగా,

తొలి రెండు దశల్లో కాంగ్రెస్ ఆధిపత్యం

ఇప్పటికే జరిగిన తొలి రెండు దశల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఎక్కువ గ్రామాల్లో సర్పంచ్‌లుగా విజయం సాధించారు.

లాస్ట్ పంచ్ ఎవరిది?

మూడో దశ పోలింగ్ నేడు జరగనుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి మరింత పెరిగింది. తొలి రెండు దశల్లో ఆధిపత్యం చెలాయించిన కాంగ్రెస్ చివరి దశలోనూ అదే జోరు కొనసాగిస్తుందా? లేక ప్రత్యర్థులు చివరి అవకాశాన్ని ఉపయోగించుకుంటారా? అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

BJP brs congress Google News in Telugu Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.