Ratnapuri College Students Assault: చదువు చెప్పాల్సిన గురువు కసాయిలా మారాడు. హోంవర్క్ చేయలేదన్న చిన్న కారణంతో విద్యార్థులను కేబుల్ వైరుతో చితకబాదిన అమానుష ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం రత్నపురి కళాశాలలో మంగళవారం చోటుచేసుకుంది.
Read Also: Warangal crime: విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త
కేబుల్ వైరుతో దాడి
హత్నూర మండలం తూర్కలఖానాపూర్ గ్రామ శివారులోని రత్నపురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో సీఎస్ఈ (CSE) మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులపై హెచ్ఓడీ (HOD) శివారెడ్డి విచక్షణారహితంగా దాడి చేశారు. హోంవర్క్ పూర్తి చేయలేదని ఆగ్రహంతో ఊగిపోయిన ఆయన, కేబుల్ వైరుతో విద్యార్థులను చితకబాదినట్లు బాధితుల తల్లిదండ్రులు తీవ్రంగా ఆరోపించారు.
Ratnapuri College Students Assault: గాయపడ్డ విద్యార్థులు
ఈ దాడిలో సాత్విక్, సందీప్, వినయ్, మహేష్, రామ్, సాయి కిరణ్, నవదీప్ సహా పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థుల వీపులపై తగిలిన వాతలు చూసి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులపై ఇలాంటి కఠినమైన దాడులు చేయడం సరికాదని స్థానికులు మండిపడుతున్నారు.
పోలీసుల వివరణ
ఈ ఘటనపై హత్నూర ఎస్ఐ శ్రీధర్ రెడ్డిని వివరణ కోరగా, ఇప్పటివరకు తమకు బాధితుల నుండి ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు అందలేదని ఆయన తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కళాశాల యాజమాన్యం కూడా ఈ విషయంపై ఇంకా అధికారికంగా స్పందించలేదు.
hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: