📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News Telugu: Sanatana Dharma: సనాతన ధర్మాన్ని పరిరక్షించాలి

Author Icon By Rajitha
Updated: October 13, 2025 • 11:55 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సికింద్రాబాద్ (secunderabad) : సనాతన ధర్మాన్ని Sanatana Dharma పరిరక్షించడమే ధ్యేయంగా ప్రతి హిందువు పాటుపడాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సనాతన ధర్మం హిందుత్వం భారతదేశంలో ఉన్నన్నినాళ్ళే సెక్యులరిజానికి అవకాశం ఉంటుందని హిందూ మతం మైనారిటీలో పడితే సెక్యులరిజం అనేది ఉందదని అన్నారు. సికింద్రాబాద్ స్కందగిరి దేవాలయంలో జరుగుతున్న శ్రీ జనార్ధన ఆనంద సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్ 25వ రజతోత్సవాలు, శ్రీ తెలంగాణ (Telangana) వేద విద్వాన మహాసభల వేడుకల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

Hyderabad Road Accident: ఎల్‌బీనగర్‌లో భయానక రోడ్డు ప్రమాదం

Sanatana Dharma

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి (kishan Reddy) మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేద పాఠశాలలో 600 మందికి పైగా విద్యార్థులకు నాలుగు రకాల వేద పరీక్షలు నిర్వహిస్తూ వేదాన్ని ప్రోత్సహించడం శుభ పరిణామమన్నారు. సనాతన ధర్మానికి Sanatana Dharma మరింత గౌరవాన్ని ఇనుమడింపజేసేలా ప్రచారాన్ని నిర్వహిస్తూ ప్రధాని మోడీ నేతృత్వంలో సనాతన ధర్మ రక్షణకు కృషి చేస్తున్నట్టు వెల్లడించారు. సనాతన ధర్మం, హిందూమతం గురించి మాట్లాడితే దేశంలోనే విమర్శలు వస్తుండడం బాధాకరమన్నారు. ఇతర మతాలను కించపరచకుండా హిందూమతం గురించి మాట్లాడే స్వేచ్చ ప్రతి ఒక్కరికి ఉందన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ తూములూరి సాయినాధ శర్మ, ప్రధాన కార్యదర్శి బ్రహ్మానంద శర్మ, మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సనాతన ధర్మం పరిరక్షణపై ఎవరు వ్యాఖ్యానించారు?
కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సనాతన ధర్మం పరిరక్షణపై వ్యాఖ్యానించారు.

కిషన్ రెడ్డి ఎక్కడ ఈ వ్యాఖ్యలు చేశారు?
సికింద్రాబాద్ స్కందగిరి దేవాలయంలో జరిగిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Hindu culture Kishan Reddy latest news sanatana dharma Skandagiri Temple Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.