Sammakka Saralamma: ముగిసిన మేడారం జాతర

Read Time:  1 min
Sammakka Saralamma: ముగిసిన మేడారం జాతర
FONT SIZE
GET APP

తెలంగాణ కుంభమేళాగా, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా విశేష ఖ్యాతి గడించిన మేడారం సమ్మక్క–సారలమ్మ (Sammakka Saralamma) మహా జాతర నేటితో, ముగిసింది.వనం వీడి జనంలోకి వచ్చి గద్దెలపై కొలువై మూడురోజుల పాటు భక్తుల పూజలందుకున్న వరాల తల్లులు తిరిగి వన ప్రవేశం చేశారు. భక్తుల జయజయధ్వానాల మధ్య గిరిజన పూజారులు సమ్మక్క (Sammakka Saralamma) తల్లిని వన ప్రవేశం చేయించారు.

Read Also: KCR: సిట్ నోటీసులపై అభ్యంతరం: జూబ్లీహిల్స్ పోలీసులకు 6 పేజీల లేఖ

నృత్యాలు

శనివారం రాత్రి ఈ వేడుక నిర్వహించగా.. సమ్మక్క తల్లిని సాగనంపే క్రతువులో గిరిజన సంగీత వాయిద్యాల చప్పుళ్లకు, కొమ్ముబూరల శబ్దాలకు భక్తులు తన్మయత్వంతో నృత్యాలు చేశారు. శివసత్తులు పూనకాలతో మేడారం ఊగిపోయింది. గద్దెలపైమూడురోజులుగా పూజలందుకున్న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను సైతం ఆయా పూజారులు తమ ప్రాంతాల్లోని ఆలయాలకు తీసుకెళ్లారు.

Sammakka Saralamma: Medaram Fair concludes
Sammakka Saralamma: Medaram Fair concludes

సారలమ్మను శనివారం రాత్రి సమయంలో కన్నెపల్లి, గోవిందరాజును ఏటూరునాగారం మండలం కొండాయికి ఆయా పూజారులు చేర్చారు. పగిడిద్దరాజు కూడా శనివారం రాత్రే బయలుదేరినా.. మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలోని ఆలయంలోకి ఇవాళ ఉదయం ప్రవేశం చేయించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.