తెలంగాణ (Telangana) రాజకీయాల్లో కవితపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే దిశగా బీఆర్ఎస్ పార్టీ(బ్రష్) సిద్ధమవుతుందని కాంగ్రెస్ నాయకుడు సామ రామ్మోహన్ రెడ్డి (Sama Ram Mohan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లో నెలకొన్న అంతర్గత విభేదాలు, కవిత రాసినట్లు ప్రచారంలో ఉన్న లేఖతో పార్టీ అంతర్యుద్ధం ముదురుతోందని ఆయన చెప్పారు. ఇటీవల గాంధీ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… “ఆ లేఖలో పేర్కొన్న ‘దెయ్యాలు’ కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ రావే” అంటూ నేరుగా విమర్శలు గుప్పించారు. పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేసే ప్రకటన త్వరలో వెలువడుతుందని తెలిపారు.
కేసీఆర్ కుటుంబంలో విభేదాలు – సొంతవారే వెన్నుపోటు
సామ రామ్మోహన్ రెడ్డి వ్యాఖ్యల ప్రకారం, కేసీఆర్ కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కవితపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించే అవకాశముందని చెప్పారు. కేటీఆర్కు కవితతో మాట్లాడే చిత్తశుద్ధి లేదని, కేసీఆర్ కూడా నిస్సహాయంగా మారిపోయారని విమర్శించారు. పార్టీని సన్మార్గంలో నడిపించాల్సిన నేతలే కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇక పార్టీ కీలక నిర్ణయాలు సంతోష్ రావే తీసుకుంటున్నారని, ఆయనే ఇప్పుడు కేసీఆర్ను కంట్రోల్ చేస్తున్నారని అన్నారు.
కేసీఆర్ కలిసే హక్కు కూడా డబ్బుతో? – సంచలన ఆరోపణ
రామ్మోహన్ రెడ్డి చేసిన మరో కీలక వ్యాఖ్య, కేసీఆర్ను కలిసేందుకు కూడా ఎమ్మెల్యేల నుంచి సంతోష్ రావు డబ్బులు వసూలు చేస్తున్నారని. ఇది ఎంతో దురదృష్టకరమైన విషయం అని పేర్కొన్నారు. గతంలో పార్టీ గురించి బయట మాట్లాడిన వారిపై కేసీఆర్ కఠినంగా వ్యవహరించారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు అదే కేసీఆర్ నిర్భందితంగా మారిపోయారని ఆరోపించారు. ఈ ఆరోపణలతో బీఆర్ఎస్ లో జరుగుతున్న అంతర్గత పోరు, రాజకీయ లెక్కలు మరింత బయటపడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాలను కీలకంగా ప్రభావితం చేయబోతున్నాయి.
Read Also : Vijayawada : విజయవాడ, విశాఖలో బాంబు బెదిరింపులు