ట్రాఫిక్ పోలీసులు, పౌరుల భద్రత కోసం చేస్తున్న అవగాహన కార్యక్రమాలు ఎంతగా విస్తృతంగా జరుగుతున్నా, కొందరు వాహనదారుల నిర్లక్ష్యంతో నగరాల్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇదే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGRTC) మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ సూటిగా హెచ్చరించారు.
సజ్జనార్ ట్వీట్
వీసీ సజ్జనార్ ఇటీవల తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ ఫొటోని షేర్ చేస్తూ, ‘‘ప్రమాదమని తెలిసి కూడా కొందరు ఇలాంటి ప్రయాణాలు చేస్తున్నారు. సమయం ఆదా చేయాలనో, గమ్యస్థానం త్వరగా చేరుకోవాలనే తాపత్రయమో.. కారణం ఏదైనా ఇలా ప్రయాణించడం ప్రాణాలతో చెలగాటమాడడమే. అనుకోని ప్రమాదం జరిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని గుర్తించడం లేదు ప్రమాదపుటంచున ప్రయాణం వద్దు. మీ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సురక్షిత ప్రయాణానికి ప్రాధాన్యం ఇవ్వండి” అని వ్యాఖ్యానించారు.
రోజురోజుకూ ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి
హైదరాబాద్ నగరంలో ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుల మీద తప్పులు చేస్తున్న వాహనదారులు తమ ప్రాణాలతోపాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ లో ప్రయాణించడం వంటి చర్యల వల్ల ప్రమాదాలే మిగిలిపోతున్నాయని చెప్పారు. ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలను సామాన్య ప్రజలు జ్ఞాపకం పెట్టుకోవాలని, వాటిని గౌరవించాలని సజ్జనార్ సూచించారు.
Read also: Revanth Reddy: నకిలీ విత్తనాలను సరఫరా చేసే వ్యాపారులపై పీడీ యాక్ట్ పెట్టాలన్న సీఎం రేవంత్ రెడ్డి