📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ న్యాయమూర్తుల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు హైదరాబాద్‌లో 38వ నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ న్యాయమూర్తుల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు హైదరాబాద్‌లో 38వ నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

Sajjanar: 80 మంది సిబ్బందిని బదిలీ చేసిన హైదరాబాద్ సీపీ

Author Icon By Anusha
Updated: December 21, 2025 • 10:44 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ నగర సీపీ వీ.సీ. సజ్జనార్ (Sajjanar) టాస్క్‌ఫోర్స్ పోలీసులకు షాక్ ఇచ్చారు. ఇటీవల టాస్క్‌ఫోర్స్ పోలీసులపై అవినీతీ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఒక్కసారిగా 80 మంది సిబ్బందిని బదిలీ చేశారు. కానిస్టేబుల్ నుంచి ఎస్సై వరకు ర్యాంక్ అధికారులను అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. టాస్క్‌ఫోర్స్ ప్రక్షాళన కోసమే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

Read Also: CM Revanth: రేపు మంత్రులతో సమావేశం కానున్న సీఎం రేవంత్

బదిలీల అనంతరం మీడియాతో మాట్లాడిన సీపీ సజ్జనార్ (Sajjanar) .. నగరంలో పెరుగుతున్న సైబర్ నేరాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రజలు రోజుకు సుమారు కోటి రూపాయలు సైబర్ మోసగాళ్ల చేతిలో పోగొట్టుకుంటున్నారని ఆయన వెల్లడించారు.

Sajjanar: Hyderabad CP transfers 80 staff members

1930 లేదా 100 నంబర్‌కు కాల్ చేయాలి

సైబర్ నేరగాళ్లు ప్రధానంగా పెట్టుబడి పేరుతో ఆశ చూపి లేదా డిజిటల్ అరెస్ట్ అంటూ భయపెట్టి డబ్బులు గుంజుతున్నారు. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని ఈ మోసాలు జరుగుతున్నాయి. రాబోయే క్రిస్మస్, సంక్రాంతి పండుగల సమయంలో వచ్చే నకిలీ ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని,

ఎటువంటి అనధికార యాప్‌లను (APK Files) డౌన్‌లోడ్ చేయకూడదని సూచించారు. మోసం జరిగిన వెంటనే 1930 లేదా 100 నంబర్‌కు కాల్ చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై కూడా సీపీ స్పందించారు. ఈ కేసును విచారించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని.. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కేంద్రంగా విచారణ వేగంగా సాగుతోందని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Hyderabad Police latest news Police Transfers Task Force Police Telugu News VC Sajjanar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.