బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) పట్ల కాంగ్రెస్ నేతలు దారుణంగా వ్యవహరించడన్ని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్రంగా ఖండించారు. ఆమె పట్ల చూపిన అవమానకర వైఖరిపై స్పందించిన ఆయన, ఇది ప్రజాస్వామ్యానికి తలవంపు అని అభివర్ణించారు.

మహిళా ఎమ్మెల్యే పట్ల ఇలా వ్యవహరించడం సిగ్గుచేటు
“ఇందిరమ్మ రాజ్యం” అని గొప్పగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఒక మహిళా ఎమ్మెల్యేను గౌరవించకపోవడం దారుణమని హరీశ్ ఆరోపించారు. మహిళా హక్కులను కాపాడాలని చెప్పే వారు, అధికారంలో ఉన్నప్పటికీ ఇలా వ్యవహరించడం చాలా దుర్మార్గమని అన్నారు.
పోలీసుల దౌర్జన్యం దారుణం
ఒక మంత్రి సమక్షంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు గూండాల్లా వ్యవహరించడమే కాకుండా, పోలీసులు సబితపై అమర్యాదగా ప్రవర్తించడం చాలా ఆందోళన కలిగించే విషయమని హరీశ్ పేర్కొన్నారు. మహిళల రక్షణకు ముందుండాల్సిన పోలీసులే వేధింపులకు పాల్పడడం శోచనీయం అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి
హరీశ్ రావు తన డిమాండులో ముఖ్యమంత్రి మరియు హోంమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి (Revanth Reddy) వెంటనే సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy)కి బహిరంగ క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు. శాసనసభ సభ్యురాలిపై దాడి జరిగేంతవరకు పోలీసులే చూసి ఊరుకోవడం బాధాకరమన్నారు. రౌడీ మూకలు, బెదిరింపులతో బీఆర్ఎస్ పార్టీ వెనక్కి తగ్గదని హరీశ్ స్పష్టం చేశారు. ప్రజలకు జరిగిన అన్యాయాలను ఎప్పటికీ గళం విప్పి వెల్లడిస్తామని, ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని హరీశ్ రావు తేల్చి చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: