Sabitha Indra Reddy: ఓబుళాపురం మైనింగ్ కేసులో సబితా ఇంద్రారెడ్డికి హైకోర్టు నోటీసులు

Read Time:  1 min
Sabitha Indra Reddy
Sabitha Indra Reddy
FONT SIZE
GET APP

తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేతగా, మాజీ మంత్రిగా ఉన్న బీఆర్ఎస్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) కి మరోసారి చట్టపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తెలంగాణ హైకోర్టు, ఆమెకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు, గతంలో విస్తృత చర్చకు కారణమైన ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించినవే.తెలంగాణ రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో ఈ కేసు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి అనేక రకాలుగా లబ్ధి చేకూర్చారన్న ఆరోపణలు పలువురు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులపై వచ్చాయి. ఇందులో సబితా ఇంద్రారెడ్డి పేరు కూడా ఉంది.ఈ కేసులో విచారణ జరిపిన నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు (Nampally CBI Special Court), కొంతకాలం క్రితం సబితా ఇంద్రారెడ్డి సహా పలువురిని నిర్దోషులుగా తేలుస్తూ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు వెలువడిన తరువాత సబితా రాజకీయంగా ఊపందుకున్నారు. అయితే, సీబీఐ మాత్రం ఈ తీర్పుతో సంతృప్తి చెందలేదు.

Sabitha Indra Reddy
Sabitha Indra Reddy

హైకోర్టులో సీబీఐ పిటిషన్

నాంపల్లి సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు, తాజా పరిణామంగా సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి కృపానందంలకు నోటీసులు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.వీరిద్దరూ కోర్టుకు సమాధానం ఇవ్వాలని, కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన గాలి జనార్ధన్ రెడ్డి, బీవీ శ్రీనివాస్ రెడ్డి, మెఫజ్ అలీఖాన్, గనుల శాఖ అప్పటి డైరెక్టర్ వీడీ రాజగోపాల్‌ను దోషులుగా నిర్దారిస్తూ శిక్షలు ఖరారు చేసింది.గాలి జనార్ధన్ రెడ్డి సహా నలుగురికి ఏడేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. దోషులకు రూ. 10 వేల చొప్పున జరిమానా కూడా విధించింది. అలాగే ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి రూ. 2 లక్షల జరిమానా విధించింది. ఈ కేసులో, అప్పటి గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రా రెడ్డికి, నాటి పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందకు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. వారిని నిర్దోషులుగా ప్రకటించడంతో సీబీఐ హైకోర్టుకు వెళ్లింది.

ఆమె ఏ పదవులు నిర్వహించారు?

సబితా ఇంద్రారెడ్డి ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు హోం మంత్రిగా పనిచేసిన తొలి మహిళ. విభజన అనంతరం తెలంగాణలో విద్యా శాఖ మంత్రిగా పని చేశారు.

ఆమె రాజకీయ ప్రస్థానం ఎలా ప్రారంభమైంది?

ఆమె భర్త పి. ఇంద్రారెడ్డి (మాజీ మంత్రి) మరణం తరువాత, 2000లో జరిగిన ఉప ఎన్నికల ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/rain-alert-heavy-rain-in-telugu-states-in-the-next-hour-warning-not-to-go-out/telangana/531977/

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.