📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Scam : రాష్ట్రంలో రూ.600 కోట్ల కోడిగుడ్ల కుంభకోణం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Author Icon By Shravan
Updated: August 13, 2025 • 1:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ Scam : రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.600 కోట్ల (Crore) కోడిగుడ్ల కుంభకోణానికి తెరలేపిందని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. గురుకులాలు ఇతర పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించే కోడిగుడ్ల ధరను కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 5.50 పైసల నుండి 7 రూపాయలకు పెంచిందని, గతంలో ఇచ్చిన కోడిగుడ్ల బరువు 50 నుండి 60 గ్రాములు ఉండగా, ప్రస్తుతం ప్రభుత్వం కోడిగుడ్ల బరువు 42 నుండి 50 గ్రాములకు తగ్గించిందని పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో కోడిగుడ్ల కంట్రాక్టు రావాలంటే ఎలాంటి వార్షిక టర్నోవర్ చూపించాల్సిన అవసరం ఉండేది కాదని, కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం టర్నోవర్ కనీసం రూ.3 కోట్లు ఉన్న వారికే కాంట్రాక్టు ఇచ్చేలా జిఒ 17 తీసుకొచ్చిందని అన్నారు. గతంలో టెండర్ ఫాం కేవలం రూ.500 నుండి రూ.1000 ఉండేదని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) టెండర్ ఫాంధరను రూ.25,000కు పెంచిందని పేర్కొన్నారు. గతంలో ఎస్సి, ఎస్టి కాంట్రాక్టర్లకు ఇ.ఎమ్.డిలో 40 శాతం రాయితీ ఉండేదని, కానీ ప్రస్తుత రేవంత్ సర్కార్ ఆరాయితీని తొలగించిందని ఆందోళన వ్యక్తం చేశారు. పేద వర్గాలు, చిన్న వ్యాపారులు కాంట్రాక్టర్లుగా ఉండకూడదని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని, అందుకే టెండర్ నిబంధనలు కొత్తగా ಬಡ್ కాంట్రాక్టర్లతో కలిసి కఠినంగా రూపొందిందని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీలో ఉన్న జానారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మెఘా కృష్ణ రెడ్డి, మాజీ ఎంపి రంజిత్ రెడ్డి, ఆంధ్ర ప్రాంతానికి చెందిన సిఎం రమేష్ వర్గీయులకే టెండర్లు వచ్చేలా రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తుందని అన్నారు. గతంలో స్థానికంగా ఉండే పేదలకు కాంట్రాక్టర్లుగా అవకాశం ఇచ్చేవారని, కానీ ఇప్పుడు మండలాన్ని ఒక యూనిట్గా చేసి ఒక్కరికే కాంట్రాక్ట్ ఇచ్చేలా నిబంధనలు మార్చారని చెప్పారు. జిఒ 17 వల్ల సుమారు 20 వేల మంది పేద వర్గాల కాంట్రాక్టర్లు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో క్యాటరింగ్ కాంట్రాక్టుకు కేవలం రూ.75 వేల డిపాజిట్ చేయాల్సి ఉండేది, కానీ ఇప్పుడు సుమారు 5 లక్షల డిపాజిట్, వార్షిక టర్నోవర్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో టెండర్ ఆధారంగా అర్హులైన వారికి కాంట్రాక్ట్ లభించేదని, కానీ ఇప్పుడు వైన్ షాపుల మాదిరిగా లాటరీ తీసే పద్దతిని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/high-court-notice-to-government-on-shifting-of-osmania-hospital-to-goshamahal-stadium/telangana/529804/

600 crore scam Breaking News in Telugu corruption news egg scam Google news Latest News in Telugu poultry industry

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.