హైదరాబాద్(Hyderabad)లో ప్రైవేట్ పాఠశాలలు ఆకాశాన్ని తాకే ఫీజుల(School Fee)తో తల్లిదండ్రులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో ఓ తండ్రి చేసిన పోస్టు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన బిడ్డను నర్సరీ క్లాస్లో చేర్పించేందుకు వెళ్లగా, స్కూల్ యాజమాన్యం ఏకంగా రూ.50వేలకుపైగా ఫీజు చెప్పిందని పేర్కొన్నారు. చిన్నారుల కోసం బుక్స్, యూనిఫాంలు, యాక్టివిటీల పేరుతో వేర్వేరు అంశాలపై పెద్ద మొత్తాన్ని వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చిన్నారులపై బుక్ బరువు
నర్సరీ విద్యార్థులకు కూడా రూ.4,200 విలువ చేసే పుస్తకాలు అవసరమా అని తండ్రి ప్రశ్నించారు. ఆ వయస్సులో పిల్లలు ఆల్ఫాబెట్లు నేర్చుకునే స్థాయిలో ఉంటారు. ఇంత భారీ ఖర్చు ఎందుకో తల్లిదండ్రులకు అంతుబట్టడంలేదని వ్యాఖ్యానించారు. పుస్తకాలు, స్టేషన్రీలు స్కూల్లోనే కొనాల్సిందేనని, బయట కొనడం అనుమతించరని కొన్ని పాఠశాలలు డిక్టేట్ చేస్తున్నాయని పలువురు తెలిపారు.
అధికారుల జోక్యం అవసరం
ఈ అంశంపై నెటిజన్లు విస్తృతంగా స్పందిస్తున్నారు. “ఇది ఎడ్యుకేషన్ లేకుండా ఒక కమర్షియల్ మిషన్గా మారింది” అని పలువురు కామెంట్లు చేస్తున్నారు. చదువుకు గౌరవం తగ్గి వ్యాపారంగా మారిన పాఠశాలలపై ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఫీజుల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన కమిటీలు ప్రభావవంతంగా పనిచేయాలన్న ఆశతో తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు.
Read Also : Air India Plane Crash : విమానం కూలడంపై TATA గ్రూప్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు