ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 నిర్వహించుకుంటున్నట్లు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలిపారు. డిసెంబరు 8న ప్రజా ప్రభుత్వ రెండోవార్షికోత్సవం వైభవంగా నిర్వహించాలని పేర్కొన్నారు. డిసెంబరు 9 న తెలంగాణ రైజింగ్ – 2047 పాలసీ డాక్యుమెంట్ను ఆవిష్కరించు కోబోతున్నట్లు తెలిపారు. శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, స్పెషల్ సిఎస్ జయేష్ రంజన్, డిజిపి శివధర్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Read Also: Bihar Results: మోడీ నాయకత్వంపై ప్రజల విశ్వాసానికి రుజువు: పవన్ కల్యాణ్
Revanth Reddy: తెలంగాణ భవిష్యత్కు రోడ్మ్యప్ రూపొందించుకోబోతున్నామని పేర్కొన్నారు. పాలసీ ఆధారంగానే భవిష్యత్ నిర్ణయాలను తీసుకునేందుకు వీలుంటుందని, పాలసీడాక్యుమెంట్తో పెట్టుబడిదారులకు ఒక స్పష్టతవస్తుందని పేర్కొన్నారు. శాఖలవారీగా పాల సీలకు సంబంధించి సమ్మిట్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. ఈనెలాఖరులోగా శాఖల వారీగా పాలసీ డాక్యుమెంట్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
ఈ గ్లోబల్ సమ్మిట్కు వివిధ దేశాల ప్రతి నిధులు వస్తున్న నేపథ్యంలో సెక్యూరిటీ విష యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశిం చారు. ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా.. డిసెంబరు 8,9న రెండు రోజులపాటు నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్- 2025పై చర్చ. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు, ఇతర అంశాలపై ఎప్పటికప్పుడు ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క సమీక్షలు నిర్వహిస్తారన్నారు
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: