📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

CM Revanth : జపాన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డి

Author Icon By Sudheer
Updated: April 24, 2025 • 11:34 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతించారు. ఈ నెల 16వ తేదీన జపాన్ పర్యటనకు బయల్దేరిన సీఎం బృందం అక్కడ పలు ప్రముఖ కంపెనీలతో సమావేశమై, తెలంగాణలో పెట్టుబడులపై చర్చలు జరిపారు.

పెద్ద మొత్తంలో రాష్ట్రానికి పెట్టుబడులు

ఈ పర్యటనలో తెలంగాణకు మేలు కలిగించేలా పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించారు. మొత్తంగా రూ. 12,062 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలోని యువతకు సుమారు 35,000 ఉద్యోగ అవకాశాలు కలిగే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పెట్టుబడులన్నీ రాష్ట్రానికి గణనీయమైన ఆర్థిక వృద్ధిని తీసుకొస్తాయని ఆశలు వ్యక్తం చేశాయి.

హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ‘నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌’ ఏర్పాటు

ప్రత్యేకంగా జపాన్‌కు చెందిన మారుబెని కంపెనీ హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ‘నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌’ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. రూ. 1,000 కోట్ల పెట్టుబడితో ఈ పార్క్ ఏర్పాటుకై ఒప్పందం జరిగింది. అదేవిధంగా ఎన్టీటీ డేటా, నెయిసా వంటి టెక్నాలజీ సంస్థలతో కలసి హైదరాబాద్‌లో రూ. 10,500 కోట్ల విలువైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు కూడా ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాల ద్వారా తెలంగాణను టెక్‌హబ్‌గా మార్చే దిశగా మరింత ముందడుగు పడినట్లు ప్రభుత్వం పేర్కొంది.

Cm Revanth Japan Tour CM Revanth Reddy Google News in Telugu Hyderabad After Japan Tour

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.