📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

రేవంత్ రెడ్డి నిజాయితీగల మోసగాడు – కేటీఆర్

Author Icon By Sudheer
Updated: February 18, 2025 • 4:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, మోసం చేస్తున్న వ్యక్తి అని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా రైతులకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. “కేసీఆర్ హయాంలో రైతులకు రూ.10,000 రైతుబంధు ఇచ్చారు. కానీ రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు రూ.15,000 అందిస్తానని హామీ ఇచ్చి, ఇప్పుడు రూ.12,000 మాత్రమే అంటున్నారు. అసలు ఆ మొత్తాన్ని కూడా ఇప్పటివరకు అందించలేకపోయారు” అని కేటీఆర్ విమర్శించారు.

అంతేకాదు, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రుణమాఫీ, బోనస్, మహిళలకు రూ.2500 ఆర్థిక సహాయం వంటి హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రిని తిట్టనంతగా రేవంత్ రెడ్డిని తిడుతున్నారని, ఆయన పాలన పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు కేవలం ఓట్ల కోసమే అన్నట్టుగా ప్రజలు భావిస్తున్నారని వ్యాఖ్యానించారు.

రేవంత్ రెడ్డి నిజాయితీగల మోసగాడని, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏమాత్రం మేలు జరగలేదని కేటీఆర్ ఆరోపించారు. “తులం బంగారం ఇవ్వడం కాదు, మహిళల మెడలో ఉన్న పుస్తెలతాడు కూడా తీసుకెళ్తాడనే పరిస్థితి వచ్చింది” అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయారని, త్వరలోనే తెలంగాణలో మార్పు అనివార్యమని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉధృతతను తెచ్చాయి.

CM Revanth Reddy congress promises Google news ktr

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.