బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వెనక బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 కీలక పాత్ర పోషించిందని అన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేటలో జరిగిన ఆత్మగౌరవ గర్జన సభలో ఆయన ప్రసంగిస్తూ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కేసీఆర్ నాయకత్వంలోని దీర్ఘకాలిక పోరాటం మరియు అంబేద్కర్ చూపిన మార్గం కారణమని వివరించారు. లక్షలాది మందిని చైతన్యపరచి, 14 ఏళ్ల పాటు ఉద్యమం చేసిన కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు.
అంబేద్కర్కు తెలంగాణ ప్రభుత్వం గౌరవం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్కు విశిష్ట గౌరవం తెలిపిందని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నిర్మించడం, సెక్రటేరియట్కు అంబేద్కర్ పేరు పెట్టడం కేసీఆర్ సీఎం పదవిలో ఉండగానే జరిగాయని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా బాబాసాహెబ్కు ఇంత గౌరవం ఇచ్చిన ఏ ఇతర సీఎం లేరని కేటీఆర్ ప్రశంసించారు.
కాంగ్రెస్పై ధ్వజమెత్తిన కేటీఆర్
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన కేటీఆర్, వారు ఇచ్చిన హామీలు అన్నీ మోసంగా మారాయని అన్నారు. దళితులకు రూ.12 లక్షలు ఇస్తామని, 26% రిజర్వేషన్లు కల్పిస్తామని, పెన్షన్లు పెంచుతామని, రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. తులం బంగారం, నెలకు రూ. 12,500, వడ్ల బోనస్ అన్నీ బోగస్ హామీలే అయిపోయాయని మండిపడ్డారు. కేసీఆర్ పునరాగమనం అవసరమని కేటీఆర్ స్పష్టంగా పేర్కొన్నారు.
Read Also : Heroins Phones : హీరోయిన్ల ఫోన్లను రేవంత్ రెడ్డి హ్యాక్ చేయిస్తున్నారు – పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు