తెలంగాణ (Telangana) రాష్ట్రంలో సంచలనంగా మారిన పాశమైలారం (Pashamylaram) పేలుడు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణ స్పందనతో అక్కడికి చేరుకున్నారు. సంగారెడ్డి జిల్లాలోని సిగాచీ ఇండస్ట్రీస్ (Sigachi Industries) వద్ద జరిగిన ఈ ఘోర విషాదం ఫ్యాక్టరీ నిర్వహణ, భద్రతా ప్రమాణాలపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది. ఈ నేపథ్యంలో సీఎం స్వయంగా పరిశీలనకు వెళ్లడం రాష్ట్రంలో పారిశ్రామిక భద్రతపై ప్రభుత్వ నిబద్ధతను చాటింది.
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీఎం
ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పోశమైలారం సిగాచీ ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. ఆయనతో పాటు మంత్రులు వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు, పొంగులేటి, దామోదర రాజనర్సింహ తదితరులు వెంట ఉన్నారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించనున్నారు.
సమగ్ర నివేదికను కోరిన సీఎం
సిగాచీ సంస్థను గతంలో ఎప్పుడు తనిఖీ చేశారో వివరించమని అధికారులను సీఎం ప్రశ్నించారు. ప్రమాదానికి గల అసలు కారణాన్ని కనుగొనాలని, నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, విచారణ జరిపించి పూర్తి నివేదికను త్వరగా సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. బాధితుల కుటుంబాలకు న్యాయం చేయడమే లక్ష్యంగా సీఎం చర్యలు చేపడుతున్నారు.
ఆస్పత్రికి వెళ్లి సీఎం – క్షతగాత్రులను పరామర్శ
ప్రమాదం అనంతరం చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆస్పత్రికి చేరుకున్నారు. బాధితులను పలకరించి, వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుండి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారి చికిత్స ఖర్చులన్నింటినీ భరిస్తుందని హామీ ఇచ్చారు.
Read also: HIV: హెచ్ఐవి బాధితులకు చేయూత