తెలంగాణ (Telangana) రాష్ట్ర రాజకీయ పాలనలో కొత్త శకం ఆరంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నాయకత్వంలోని ప్రభుత్వం శాసన, విధాన నిర్ణయాలలో వేగాన్ని, ప్రజా ప్రయోజనాలపై దృష్టిని పెంచే దిశగా ఓ కీలక అడుగు వేసింది. ఇకపై ప్రతి నెలలో రెండుసార్లు — మొదటి శనివారితో పాటు మూడవ శనివారాన్ని కేబినెట్ సమావేశాలకు (Cabinet meetings) కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారికంగా ప్రభుత్వ ఆదేశాలు వెలువడ్డాయి.
తాజా నిర్ణయం వెనుక ఉద్దేశం:
గతంలో మంత్రివర్గ సమావేశాలు చాలా అరుదుగా జరుగుతుండటంతో అనేక కీలక నిర్ణయాలు ఆలస్యం కావడం జరుగుతుంది. కొత్త పాలనలో ఇది మారాలి అనే ఉద్దేశంతోనే ఈ వ్యవస్థను తీసుకొచ్చారు. సాధారణంగా కీలకమైన అంశాలపై చర్చించి, ఆమోదం తెలిపేందుకు కేబినెట్ సమావేశాలు జరుగుతుంటాయి. అయితే, ఈ సమావేశాలు మరింత తరచుగా జరగడం వల్ల ప్రజా ప్రాముఖ్యత కలిగిన అనేక అంశాలపై త్వరితగతిన చర్చించి, నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో అనవసర జాప్యాన్ని నివారించి, ప్రభుత్వ కార్యకలాపాలను మరింత చురుగ్గా ముందుకు తీసుకెళ్లడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.
రాజకీయ విశ్లేషణ:
ముఖ్యంగా ఎన్నికల హామీల అమలుపై పర్యవేక్షణ, శాఖల పనితీరు సమీక్ష, నూతన కార్యక్రమాల రూపకల్పన వంటి అంశాలు రెగ్యులర్గా మంత్రివర్గ స్థాయిలో చర్చకు వస్తే, పాలన లోపాలు త్వరగా గుర్తించడానికి, సవరించడానికి అవకాశాలు మెరుగవుతాయి.
Read also: Hydra: బేగంపేటలో అక్రమల పై హైడ్రా కొరడా
Kaleshwaram Commission: కాళేశ్వరం కమిషన్ విచారణకు నేడు ఈటల రాజేందర్ హాజర్