📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Revanth Reddy;దీపావళి పండుగను విదేశీ మద్యంతో జరుపుకుంటున్నారా? అని ప్రశ్న

Author Icon By Divya Vani M
Updated: October 29, 2024 • 8:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జన్వాడ ఫాంహౌస్ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా మారాయి దీపావళి పండుగలో చిచ్చుబుడ్లు కాల్చే సంప్రదాయం ఉంటే, ఫాంహౌస్‌లో మాత్రం సారాబుడ్లు (మద్యం) వెలుగులోకి వచ్చాయని ఎద్దేవా చేశారు కేటీఆర్ విదేశీ మద్యంతో దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారా? అంటూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు ఆయన ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, ఫాంహౌస్ ఘటనపై బీఆర్ఎస్ నేతల కట్టుకథలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు అలాగే, తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు మీడియా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు సమయం వచ్చినప్పుడు తాను మూసీ నదీ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేపడతానని, అవసరమైతే వాడపల్లి నుంచి వికారాబాద్ వరకు నడుస్తానని తెలిపారు ఈ పాదయాత్రలో బీఆర్ఎస్ నేతలు కూడా రావాలని విసురుగా సవాలు విసిరారు. అంతేకాదు, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ద్వారా అవాస్తవాల ప్రచారం చేస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు అక్రమ సొమ్ముతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

రియల్ ఎస్టేట్ రంగం పై కూడా రేవంత్ రెడ్డి స్పందిస్తూ, హైదరాబాద్ కారణంగా ఈ రంగం పడిపోలేదని, దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం నిశ్చలంగా ఉందని అన్నారు సినిమాలలో రాజమౌళి, రాంగోపాల్ వర్మలకు వేర్వేరు స్టైల్ ఉన్నట్లు, రాజకీయాల్లోనూ తన స్టైల్, కేటీఆర్ స్టైల్ వేర్వేరుగా ఉన్నాయని అన్నారు తనకు చిన్న వయస్సు, ఇంకా రాజకీయంగా విస్తారమైన భవిష్యత్తు ఉందని, ప్రజలను అణచివేసే ప్రయత్నం చేయాల్సిన అవసరం తనకు లేదని పేర్కొన్నారు ప్రజాస్వామ్య బాటలోనే ముందుకు సాగతానని స్పష్టం చేశారు ఇక కేసీఆర్‌పై విమర్శలు చేస్తూ, ఆయన పని అయిపోయిందని, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ఆరోపించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రూ. 7 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసినట్లు రేవంత్ విమర్శించారు టీజీపీఎస్సీ నియామకాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 90% రిజర్వేషన్లు కేటాయించడంపై ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

brs Deepavali ktr Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.