📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

2029 Elections : 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన రేవంత్

Author Icon By Sudheer
Updated: December 24, 2025 • 9:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కోస్గిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన రాబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ధీమా వ్యక్తం చేస్తూ విపక్షాలకు సవాల్ విసిరారు. వచ్చే 2029 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడింట రెండు వంతుల (2/3) మెజార్టీతో క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్ వైపు ప్రజలను మళ్లీ తిప్పుకుంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

CP Sajjanar: న్యూఇయర్‌ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు

నియోజకవర్గాల పునర్విభజన జరిగినా, జరగకపోయినా విజయం తమదేనని రేవంత్ రెడ్డి గణాంకాలతో సహా వివరించారు. ఒకవేళ 2029 నాటికి నియోజకవర్గాల సంఖ్య పెరగకుండా 119 సీట్లే ఉంటే, అందులో 80 కంటే ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ జరిగి అసెంబ్లీ సీట్ల సంఖ్య 150కి పెరిగితే, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 100 మార్కును దాటుతుందని స్పష్టం చేశారు. ఈ అంచనాలు కేవలం ఊహలు కావని, గ్రౌండ్ లెవల్‌లో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణే దీనికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.

ముఖ్యంగా బీఆర్ఎస్ అగ్రనేతలను లక్ష్యంగా చేసుకుని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. “చంద్రశేఖర్ రావు, హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు సహా బీఆర్ఎస్ నాయకులంతా ఇది రాసి పెట్టుకోండి” అని రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. తాను రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రానివ్వనని ఆయన శపథం చేశారు. బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూనే, మరోవైపు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుపై ఆయన వ్యక్తం చేసిన ఈ బలమైన నమ్మకం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపగా, ప్రత్యర్థి పార్టీల నుండి తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

#APCongress 2029 Election results 2029 elections cm revanth Google News in Telugu Latest News in Telugu Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.