📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

CM Revanth : రేవంత్ రాష్ట్రంలో ఉండేది తక్కువ.. ఢిల్లీలో ఎక్కువ – ఎమ్మెల్సీ కవిత

Author Icon By Sudheer
Updated: July 25, 2025 • 9:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కాకునూర్ గ్రామంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) గృహలక్ష్మి పథకాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ పోస్ట్‌కార్డు ఉద్యమం ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై ఆమె భగ్గుమన్నారు. “తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నదంటే ఢిల్లీలోనే ఎక్కువగా ఉంటారు. రాష్ట్రం సమస్యల మీద దృష్టి పెట్టే పరిస్థితి లేద” అంటూ విమర్శలు గుప్పించారు. స్కూటీ, తులం బంగారం వంటి హామీలను గుర్తుచేసి – వాటిలో ఒక్కటైనా అమలు అయ్యిందా అని ప్రశ్నించారు.

రేషన్ బియ్యం నాణ్యతపై ఆరోపణలు

కవిత మాట్లాడుతూ, రేషన్ షాపుల్లో పంపిణీ అవుతున్న సన్న బియ్యంలో 50 శాతం దొడ్డు బియ్యం ఉందని ఆరోపించారు. ఇదే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.2 లక్షల కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అంబులెన్సులకు డీజిల్ పోసే పరిస్థితి లేకపోవడం దారుణమన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీల్లో కాంగ్రెస్ కార్యకర్తలే ఉన్నారని, ఇది రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ పథకాలను వాడుకునే చర్యలని ఆమె ఆరోపించారు.

ఫ్రీ బస్సు స్కీం పేరుతో గ్రామాలకు నష్టం

ఎమ్మెల్సీ కవిత, ఫ్రీ బస్సు పథకం పేరుతో గ్రామాలకు వెళ్లే బస్సులు తగ్గించారని ఆరోపించారు. “ఈ ప్రభుత్వం ప్రజల కోసం పని చేయదు. పని చేయించుకోవాలంటే వెంటపడాల్సిందే” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటేయండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన కవిత, కాంగ్రెస్‌ హామీలను నెరవేర్చనందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read Also : Thavisak :100 బీర్లు తాగి ఒక వ్యక్తి మృతి..ఎందుకంటే?

Congress govt free bus Google News in Telugu mlc kavitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.