📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

రైతు భరోసాపై రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం?

Author Icon By sumalatha chinthakayala
Updated: December 16, 2024 • 11:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు షాకింగ్ న్యూస్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలోనే రైతు భరోసా అందించేందుకు సిద్ధమైంది. సీఎం రేవంత్ సహా కీలక మంత్రులు సంక్రాంతి నుంచి రైతు భరోసా అందిస్తామని చెబుతున్నారు. గతంలో భూమి ఉన్న రైతులు అందరికీ కేసీఆర్ రైతు భరోసా ఇచ్చారు. తాజాగా కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసాకు కటాఫ్ పెట్టనున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ వేసింది. 7 నుంచి 10 ఎకరాల లోపు ఉన్న వారికే రైతు భరోసా లిమిట్ పెడతారని టాక్ వినిపిస్తోంది.

ప్రజాప్రతినిధులు, IAS, IPS అధికారులకు సైతం రైతుభరోసా ఇవ్వకూడదని కేబినెట్ సబ్ కమిటీ సర్కార్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. రైతు భరోసాపై కమిటీ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీ, కేబినెట్ భేటీలో చర్చించి రైతు భరోసా అమలుపై విధి విధానాలను రూపొందిస్తారని సమాచారం. కాగా, రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకూ సీజన్‌కు ఒకసారి ఎకరాకు రూ.7500 ఇవ్వనున్నారు.

ఈ అంశంపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. సబ్ కమిటీ సిఫార్సులపై అసెంబ్లీలో చర్చించి, తదుపరి క్యాబినెట్ భేటీలో దీనిపై స్పష్టత ఇవ్వనున్నారు. రైతు భరోసా పథకం ద్వారా లక్షలాది మంది రైతులకు మేలు చేకూర్చాలన్నదే ప్రభుత్వ ధ్యేయంగా ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రైతు భరోసా పథకం లక్ష్యం చిన్న, సన్నకారు రైతుల పరిస్థితిని మెరుగుపరచడమే. ఎకరాల పరిమితిని నిర్దేశించడం ద్వారా ఈ పథకం తగినవారికి మాత్రమే అందుతుందని భావిస్తున్నారు. ఈ నిర్ణయాలు వాస్తవంలో ఏ విధంగా అమలవుతాయో చూడాల్సి ఉంది.

Farmers rythu bharosa telangana government

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.