हिन्दी | Epaper
అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్

CM Revanth : చర్చకు రమ్మంటే రేవంత్ ఢిల్లీకి పారిపోయాడు – కేటీఆర్

Sudheer
CM Revanth : చర్చకు రమ్మంటే రేవంత్ ఢిల్లీకి పారిపోయాడు – కేటీఆర్

తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో రైతుల సమస్యలపై చర్చకు రావాలని సవాల్ విసిరిన కేటీఆర్, తాను ప్రెస్ క్లబ్‌కు వచ్చానని, కానీ రేవంత్ ఢిల్లీకి పారిపోయాడని సెటైర్లు వేశారు. “రచ్చ చేయడం తప్ప చర్చ చేయడం రాదని సీఎం రేవంత్ రెడ్డి నిరూపించుకున్నాడు” అంటూ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ శ్రేణులు ‘రేవంత్ ఢిల్లీ పరార్’ అంటూ నినాదాలు చేశారు.

ముఖ్యమంత్రి స్థాయికి ఇది తగునా?

చర్చకు మంత్రులను అయినా పంపుతారని తాను భావించానని కానీ వారు కూడా రాకపోవడం బాధాకరమని కేటీఆర్(KTR) అన్నారు. “చర్చకు సాహసం లేకపోతే, ఇకపై సవాళ్లు చేయకండి” అని హెచ్చరించారు. యూరియా బస్తాల పేరుతో ఢిల్లీకి వెళ్లారని చెబుతున్న రేవంత్ నిజంగా ఏ బస్తాలు మోస్తున్నారో ప్రజలకు తెలుసునని విమర్శించారు. చంద్రబాబు నాయుడు కోసం తెలంగాణ నీళ్లను ఆంధ్రకు పంపుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్‌కు క్షమాపణ చెప్పే ధైర్యం రేవంత్‌కు ఉండాలని డిమాండ్ చేశారు.

గ్యారంటీలు ఏమయ్యాయి?

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు, బాండ్ పేపర్లపై రాసి ఇచ్చిన హామీలు ఎక్కడ అని ప్రశ్నించిన కేటీఆర్, వాటిని పూర్తిగా అమలు చేయకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. 2018లో కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న మాటను రేవంత్ తప్పిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఇది ఆయన మోసపు రాజకీయాలకు ఉదాహరణ అన్నారు. మళ్లీ ఎప్పుడైనా చర్చకు పిలిస్తే తాను సిద్ధంగా ఉంటానని, ప్లేస్, టైం రేవంత్ డిసైడ్ చేయాలని సవాల్ విసిరారు. “రేవంత్ స్థాయికి మేమే చాలాం… కేసీఆర్ అవసరం లేదు” అంటూ తేల్చేశారు.

Read Also : ఐపీఎల్ బ్రాండ్ విలువలో ఆర్సీబీకి అగ్రస్థానం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870