📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

1.21 లక్షలకు పైగా జాబ్ కార్డులు తొలగింపు!

Author Icon By Ramya
Updated: February 6, 2025 • 5:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

2023-24 మధ్య కాలంలో తెలంగాణలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి 1,21,422 మంది కార్మికుల పేర్లను తొలగించినట్లు కేంద్రం వెల్లడించింది. లోక్ సభలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ) ఎంపీ ఎస్.వెంకటేశన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్ సమాధానమిచ్చారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 68 లక్షలకు పైగా(68,86,532) మంది కార్మికులను, తొలగించారని, 2022-23లో 86,17,887 మంది కార్మికులను తొలగించారని వెల్లడించారు. ఉపాధి హామీ పథకంలో రాష్ట్రాల వారీగా డేటాను కూడా మంత్రి తెలిపారు. తెలంగాణ నుంచి 1.21 లక్షలకు పైగా జాబ్ కార్డులను తొలగించినట్లు తెలిపారు.

నకిలీ,తప్పు జాబ్ కార్డులు, పలు కుటుంబాలు గ్రామాలను శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్లడం, గ్రామాలను పట్టణ ప్రాంతాలుగా మార్చడం వంటి కారణాల వల్ల ఉపాధి హామీ పథకంలో తొలగింపులు జరిగాయని మంత్రి చెప్పారు.కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మెటీరియల్ కాంపోనెంట్స్ కోసం పెండింగ్ నిధులు రూ.282.74 కోట్లు, కార్మికులకు ఇవ్వాల్సిన నిధులు రూ.15.46 కోట్లు చెల్లించాల్సి ఉంది.

దేశంలోని గ్రామీణ నిరుద్యోగులకు ఉపాధిని కల్పించడమే లక్ష్యంగా మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారు. ఇటీవల కాలంలో ఉపాధి హామీ పథకం కోసం వాస్తవ విడుదల మొత్తాలు ప్రారంభ బడ్జెట్ అంచనాలను మించిపోయాయి. దీనిని బట్టి ఉపాధి పొందేవారి సంఖ్య అర్థం అవుతుంది.ఈ పథకం అమలు బాధ్యత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు ఉందని మంత్రి కమలేష్ పాశ్వాన్ వెల్లడించారు. జాబ్ కార్డులను అప్ డేట్ చేయడం తొలగించడం అనేది రాష్ట్రాలు నిర్వహించే ఒక సాధారణ ప్రక్రియ అని తెలిపారు. అయితే జాబ్ కార్డులను తొలగించే సమయంలో నిబంధనలకు అనుగుణంగా ఉండాలని ఆయన సూచించారు. అర్హత కలిగిన కుటుంబాల జాబ్ కార్డులను రద్దు చేయలేమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్ స్పష్టం చేశారు.

Breaking News in Telugu Employment Guarantee Scheme Google news Google News in Telugu job cards Latest News in Telugu Paper Telugu News Telangana Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today workers

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.