OU Professor Kasim: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ ఖాసీంకు తెలంగాణ హైకోర్టులో పెద్ద ఉపశమనం లభించింది. గతంలో ఆయనపై నమోదైన రెండు క్రిమినల్ కేసులను కోర్టు కొట్టివేసింది.. ఈ కేసుల కారణంగా ఎదుర్కొంటున్న న్యాయపరమైన చిక్కుల నుంచి ఆయనకు విముక్తి లభించినట్లయింది.
Read Also: SLBC Accident: మృతదేహాల వెలికితీతలో వైఫల్యం:కేటీఆర్
ధర్నా నేపథ్యంలో పోలీసుల చర్య..
నిబంధనలకు విరుద్ధంగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో ధర్నా నిర్వహించారన్న ఆరోపణలతో పోలీసులు ప్రొఫెసర్ ఖాసీంపై రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. అయితే, ఈ కేసులపై ప్రొఫెసర్ ఖాసీం హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రాథమిక ఆధారాలు, నిబంధనలను పరిశీలించాలని కోర్టును కోరారు. వాదనల అనంతరం.. కేసులను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
క్వాష్ పిటిషన్ (Quash Petition) అంటే చట్టపరంగా ఒక కేసును లేదా ఎఫ్.ఐ.ఆర్ (FIR)ను రద్దు చేయమని కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో దాఖలు చేసే విన్నపం.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: