हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు రెడ్‌ అలర్ట్‌..ఎందుకంటే..!

Sudheer
శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు రెడ్‌ అలర్ట్‌..ఎందుకంటే..!

జనవరి 26న గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈనెల 30వ తేదీ వరకు ఎయిర్‌పోర్టు వద్ద ఈ అలర్ట్ కొనసాగుతుందని నిఘా అధికారులు వెల్లడించారు. భద్రతను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ భద్రతా బలగాలు అత్యవసర విధుల్లో నిమగ్నమయ్యారు. ఎయిర్‌పోర్టు ప్రధాన మార్గాల్లో బాంబ్ స్క్వాడ్, డాంగ్ స్క్వాడ్‌తో తనిఖీలు కొనసాగిస్తున్నారు. అనుమానిత వాహనాలు, వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టి సమర్థంగా తనిఖీలు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ఎయిర్‌పోర్టుకు వచ్చే సందర్శకులకు అనుమతిని పూర్తిగా రద్దు చేశారు. ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతి ఇస్తున్నారు. సందర్శకులు అనుమతి లేకుండా ఎయిర్‌పోర్టు పరిధిలోకి రాకుండా చర్యలు చేపట్టారు. ఈ చర్యల ద్వారా ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అనుమానిత వస్తువులు లేదా వ్యక్తులు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే భద్రతా బలగాలకు సమాచారం అందించాలంటూ ప్రజలను కోరుతున్నారు. గణతంత్ర దినోత్సవం వేడుకలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులు, భద్రతా బలగాలు నిరంతరం నిఘా నిర్వహిస్తూ అప్రమత్తంగా ఉంటున్నారు.

ఈ చర్యల ద్వారా శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద భద్రతా ప్రమాణాలు మరింత మెరుగుపరచడంతో పాటు, ప్రజలలో భద్రతా నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో అత్యవసర నిఘా కొనసాగుతూ గణతంత్ర దినోత్సవాన్ని సజావుగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870