📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్

Author Icon By Sudheer
Updated: May 22, 2025 • 5:30 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ (Hyderabad) నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం ఎండగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం సమయంలో కుండపోత వర్షానికి (Rain) మారింది. దిల్‌సుఖ్‌నగర్, రామంతపూర్, అంబర్‌పేట్, నాంపల్లి, చార్మినార్, మలక్‌పేట్, బంజారాహిల్స్, అమీర్‌పేట వంటి అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షం ప్రభావంతో రోడ్లపై జలమయం ఏర్పడి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శంషాబాద్, గచ్చిబౌలి, మెహదీపట్నం, టోలిచౌకి వంటి ప్రాంతాల్లోనూ వర్షం బాగా కురుస్తోంది.

రెడ్‌ అలర్ట్‌తో అధికారులు అప్రమత్తం

తీవ్ర వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ హైదరాబాద్‌ సహా తెలంగాణ పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్ ప్రకటించింది. రానున్న మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. అధికారులు ప్రజలను అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు రక్షణ చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగం అలర్ట్‌ అయింది. జీహెచ్ఎంసీ, ట్రాఫిక్, విద్యుత్, పోలీసులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి

వర్ష ప్రభావం వల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. కాంటాలు వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని, ట్రాఫిక్‌, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని సూచించారు. గంటకు 30–40 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించగా, విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వర్షాభావ స్థితిని నియంత్రించేందుకు ప్రతి శాఖ సమన్వయంగా పని చేయాలని ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

Read Also : Amit Shah: ఇంత పెద్ద మావోయిస్టు నేతను హతమార్చడం ఇదే తొలిపారి.. అమిత్‌ షా

hyderabad Rains Read Alert Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.