హైదరాబాద్ (Hyderabad) నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం ఎండగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం సమయంలో కుండపోత వర్షానికి (Rain) మారింది. దిల్సుఖ్నగర్, రామంతపూర్, అంబర్పేట్, నాంపల్లి, చార్మినార్, మలక్పేట్, బంజారాహిల్స్, అమీర్పేట వంటి అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షం ప్రభావంతో రోడ్లపై జలమయం ఏర్పడి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శంషాబాద్, గచ్చిబౌలి, మెహదీపట్నం, టోలిచౌకి వంటి ప్రాంతాల్లోనూ వర్షం బాగా కురుస్తోంది.
రెడ్ అలర్ట్తో అధికారులు అప్రమత్తం
తీవ్ర వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ హైదరాబాద్ సహా తెలంగాణ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. రానున్న మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. అధికారులు ప్రజలను అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు రక్షణ చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. జీహెచ్ఎంసీ, ట్రాఫిక్, విద్యుత్, పోలీసులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి
వర్ష ప్రభావం వల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. కాంటాలు వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని, ట్రాఫిక్, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని సూచించారు. గంటకు 30–40 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించగా, విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వర్షాభావ స్థితిని నియంత్రించేందుకు ప్రతి శాఖ సమన్వయంగా పని చేయాలని ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
Read Also : Amit Shah: ఇంత పెద్ద మావోయిస్టు నేతను హతమార్చడం ఇదే తొలిపారి.. అమిత్ షా