📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest Telugu News: Malkajgiri: హత్యకు గురైన స్థిరాస్తి వ్యాపారి

Author Icon By Vanipushpa
Updated: December 8, 2025 • 5:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మల్కాజ్​గిరి(Malkajgiri) జిల్లా జవహర్‌నగర్​లో ఓ స్థిరాస్తి వ్యాపారి దారుణ హత్య(Murder)కు గురయ్యారు. సాకేత్‌ కాలనీ ఫోస్టర్‌ బిల్లా బాంగ్‌ స్కూల్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉదయం గుర్తు తెలియని దుండగులు కత్తులతో నరికి, బండ రాయితో మోది, ఆపై కాల్చి నడిరోడ్డుపై అతడిని దారుణంగా హత్య చేశారు. ఘంటా వెంకటరత్నం (46) స్థిరాస్తి వ్యాపారి. పిల్లలను పాఠశాలలో దింపి ఇంటికి వెళ్తుండగా దుండగులు అతడి ద్విచక్ర వాహనాన్ని వెంబడించారు. కత్తులతో దాడి చేసి నరికి, ఆపై తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘటనలో వెంకటరత్నం అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.

Read Also: Kavitha: కూకట్‌పల్లికి కనీస వసతులు లేవు: కవిత కామెంట్స్

Malkajgiri

ఆర్థిక లావాదేవీల కారణంగానే హత్య?

ఆర్థిక లావాదేవీల కారణంగానే హత్య జరిగి ఉండవచ్చని, అతని ప్రత్యర్థులే చంపి ఉంటారని పోలీసులు అనుమానం వక్తం చేస్తున్నారు. ఆ కోణంలోనే దర్యాప్తును ముమ్మరం చేశారు. గతంలో ఓ జంట హత్యల కేసులో ఘంటా వెంకటరత్నం నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడిపై ధూల్‌పేటలో రౌడీషీట్ ఉన్నట్లు గుర్తించారు. ఘంటా వెంకటరత్నం హత్య విషయాన్ని తెలుసుకున్న కుటుంబసభ్యులు ఘటనా స్థలికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు.
హత్యకు సంబంధించి మల్కాజ్​గిరి డీసీపీ శ్రీధర్ మాట్లాడారు. వెంకటరత్నం (46) అనే వ్యక్తిని హత్య చేసినట్టు సమాచారం రావడంతో వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారని తెలిపారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ బృందాలతో కలిసి విచారిస్తున్నామని, మృతుడిని కత్తులతో తల, మెడ, కడుపు, వీపుపై దారుణంగా నరికి, బండరాయితో మోది, ఆపై కాల్పులు జరిపి చంపారని అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu Crime News Criminal Incident Google News in Telugu Investigation Ongoing Latest In telugu news Local News Murder case Police Inquiry Real Estate Businessman Telugu News Today Violence Report

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.