దేశ ఆర్థిక సర్వే 2024-25 ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా (Ranga Reddy) దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా గుర్తింపు పొందింది. ఈ జిల్లా తలసరి జీడీపీ (Per Capita GDP) రూ. 11.46 లక్షలుగా నమోదైంది. ఇది దేశంలోని ఇతర ప్రధాన నగరాలను వెనక్కి నెట్టింది.
Read Also: Army Recruitment Rally: హనుమకొండలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
రంగారెడ్డికి తర్వాత హరియాణాలోని గురుగ్రామ్ (₹9.05 లక్షలు), కర్ణాటకలోని బెంగళూరు అర్బన్ (₹8.93 లక్షలు), ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ్ నగర్ (నోయిడా), హిమాచల్ ప్రదేశ్లోని సోలాన్, గోవా రాష్ట్రంలోని నార్త్, సౌత్ గోవా, సిక్కిం, దక్షిణ కన్నడ, ముంబై (₹6.57 లక్షలు), అహ్మదాబాద్ జిల్లాలు ఉన్నాయి.
ఈ జిల్లాలో మౌలిక సదుపాయాలు
రంగారెడ్డి జిల్లా (Ranga Reddy) ఆర్థిక అభివృద్ధికి ప్రధాన కారణం ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్ మరియు పరిశ్రమల విస్తరణ. హైదరాబాద్ (Hyderabad) సమీపంలో ఉండటం వలన ఈ జిల్లాలో మౌలిక సదుపాయాలు విస్తృతంగా పెరిగాయి. గచ్చిబౌలి, మాధాపూర్, నానకరామగుడా, షమ్షాబాద్, పటాంచెరు, బాచుపల్లి వంటి ప్రాంతాలు ఐటీ, బయోటెక్, ఫార్మా కంపెనీలకు ప్రధాన కేంద్రాలుగా మారాయి.
అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్ (ORR), మెట్రో కనెక్టివిటీ వంటి ఆధునిక రవాణా సదుపాయాలు కూడా ఈ ప్రాంత ఆర్థిక ప్రగతిని మరింత వేగవంతం చేశాయి. ఐటీ, ఫార్మా కంపెనీలు, మెరుగైన కనెక్టివిటీ వల్ల రంగారెడ్డి టాప్లో నిలిచింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: