Ramachander Rao: మీడియా సంస్థలకు రక్షణ కల్పించాలని రామచందర్ రావు డిమాండ్

Read Time:  1 min
Ramachander Rao: మీడియా సంస్థలకు రక్షణ కల్పించాలని రామచందర్ రావు డిమాండ్
FONT SIZE
GET APP

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు గట్టు రామచందర్ రావు (Ramachander Rao) అధికార కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మీడియా స్వేచ్ఛను అణచివేయాలనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయనీ, స్వతంత్రంగా పని చేస్తున్న మీడియా సంస్థలపై దాడులు తక్షణమే ఆపాలని (attacks must stop immediately). హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్తంభమని గుర్తు చేస్తూ, దానిపై జరిగే దాడులు సహించబోమని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ శ్రేణుల దాడులపై తీవ్ర హెచ్చరిక

మీడియా సంస్థలపై బీఆర్ఎస్ శ్రేణులు దాడులు చేస్తున్నాయని, ఇది అత్యంత దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించినా బీఆర్ఎస్ నేతల (BRS leaders) కు ఇంకా బుద్ధి రాలేదని విమర్శించారు. మీడియా సంస్థలకు ప్రభుత్వం తక్షణమే రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏబీఎన్ కార్యాలయానికి భద్రత కల్పించాలని బీజేవైఎం కార్యకర్తలకు సూచించినట్లు తెలిపారు.

వాక్ స్వాతంత్ర్యానికి బీజేపీ మద్దతు

రామచందర్ రావు (Ramachander Rao) మాట్లాడుతూ, మీడియాపై గానీ, సామాన్య ప్రజలపై గానీ దాడులు చేస్తే ఊరుకునేది లేదని, వారి అంతు చూస్తామని హెచ్చరించారు. “మీడియా సంస్థలపై దాడులు చేస్తే ఖబడ్దార్ టీ న్యూస్ సంగతి చూస్తాం” అని బీఆర్ఎస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాము వాక్ స్వాతంత్ర్యాన్ని గౌరవిస్తామని, తమపై తప్పుడు వార్తలు రాస్తే న్యాయపరంగానే ఎదుర్కొంటామని, దాడులు చేయబోమని స్పష్టం చేశారు.

పాతబస్తీలోని అక్రమ భవనంపై కాంగ్రెస్‌కు అల్టిమేటం

ఓ వైపు బీఆర్ఎస్‌కి హెచ్చరికలు చేస్తూ, మరోవైపు అధికార కాంగ్రెస్పాతబస్తీలోని సల్కం చెరువు భూమిలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ నిర్మించిన అక్రమ కాలేజీ భవనంపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఆయన తప్పుపట్టారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని భవనాన్ని కూల్చలేమని ప్రభుత్వం చెప్పడంపై మండిపడ్డారు. అక్బరుద్దీన్‌కు ఒక న్యాయం, మూసీ పరీవాహక ప్రాంతాల్లోని పేదలకు మరో న్యాయమా అని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే ఆ అక్రమ కట్టడాన్ని కూల్చివేయాలని, లేకపోతే ప్రజల పక్షాన బీజేపీయే ఆ పని చేస్తుందని కాంగ్రెస్ సర్కారుకు అల్టిమేటం జారీ చేశారు .

బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎవరు?

ఈ పార్టీ హైదరాబాద్‌లో ఉంది, దీనికి ఎన్. రాంచందర్ రావు నాయకత్వం వహిస్తున్నారు మరియు ఆయన తెలంగాణ బిజెపి అధ్యక్షుడు. 

read hindi news: hindi.vaartha.com

Read also: Kavitha: స్వర్ణకారుల ఆత్మహత్యలపై కవిత ఆవేదన వ్యక్తం

Sharanya

రచయిత గురించి

Sharanya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.