హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మత్తు పదార్థాల వ్యసనాన్ని పూర్తిగా అరికట్టాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రజలందరూ సహకరించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Damodara Rajanarsimha) పిలుపునిచ్చారు. సమాజంలోని అన్ని వర్గాల భాగస్వామ్యం ఉంటేనే ఈ లక్ష్యాన్ని వేరుకోగలమని ఆయన అన్నారు. డ్రగ్స్ నిర్మూలనపై పోరులో పోలీసు, ఆరోగ్యశాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ఈ మేరకు శుక్రవారం సెక్రటేరియట్లో రెండు శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
Read also : DG Daljeet Singh Chaudhary: ప్రజాస్వామ్య మనుగడలో పోలీసులది కీలకపాత్ర
ట్రీట్మెంట్, అవగాహన కార్యక్రమాలు
రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు తీసుకుంటున్న చర్యల గురించి టీఏఎన్సీ (Telangana Anti-Narcotics Cell) డైరెక్టర్ సందీప్ శాండిల్య మంత్రికి వివరించారు. మత్తు పదార్ధాలకు అలవాటైన వారిని గుర్తించి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి, ఆ తర్వాత డీఅడిక్షన్ సెంటర్లకు తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. పిల్లలు మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా తల్లిదండ్రులు, టీచర్లు(Teachers) జాగ్రత్తలు తీసుకోవాలని, వారిలో వచ్చే ప్రవర్తన మార్పులపై (Behavioral Changes) ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని మంత్రి సూచించారు. స్కూళ్లు, కాలేజీలు, హాస్పిటళ్లలో రెగ్యులర్ కార్యక్రమాలు నిర్వహించాలని, క్షేత్రస్థాయి ఆరోగ్య కార్యకర్తల ద్వారా గ్రామాల్లోనూ విస్తృతంగా ప్రచారం జరగాలని ఆయన సూచించారు.
డీఅడిక్షన్ సెంటర్ల బలోపేతం
అన్ని విద్యా సంస్థల్లో యాంటీ నార్కోటిక్స్ వింగ్స్ను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. డ్రగ్స్ వినియోగం నుంచి బయటపడేసేందుకు అవసరమైన డీఅడిక్షన్ సెంటర్లను బలోపేతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని టీచింగ్ హాస్పిటళ్లలో డీఅడిక్షన్ వార్డులు ఏర్పాటు చేశామని, ఎర్రగడ్డలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్(Institute of Mental Health) ప్రాంగణంలో అత్యాధునిక వసతులతో డీఅడిక్షన్ సెంటర్ను అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. మత్తు పదార్థాలకు అలవాటైన పిల్లలను తల్లిదండ్రులే డీఅడిక్షన్ సెంటర్లకు తీసుకురావాలని, ఆలస్యం చేస్తే వారి ఆరోగ్యం మరింత పాడయ్యే ప్రమాదం ఉంటుందని మంత్రి హెచ్చరించారు. బాధితులకు పూర్తి ఉచితంగా కౌన్సెలింగ్, చికిత్స అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
డ్రగ్స్ నిర్మూలన లక్ష్యాన్ని చేరుకోవడానికి మంత్రి ఎవరి సహకారాన్ని కోరారు?
పోలీసు, ఆరోగ్య శాఖలతో పాటు సమాజంలోని అన్ని వర్గాల భాగస్వామ్యాన్ని మంత్రి కోరారు.
మత్తు పదార్థాలకు అలవాటైన పిల్లల చికిత్స ఉచితంగా అందిస్తారా?
అవును, వారికి పూర్తి ఉచితంగా కౌన్సెలింగ్ మరియు చికిత్స అందిస్తారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :