📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Author Icon By Sharanya
Updated: April 13, 2025 • 6:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణకు సిద్ధమవుతుండగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తనకు మంత్రి పదవి ఖాయమని, కాంగ్రెస్ అధిష్ఠానం ఆ మేరకు హామీ ఇచ్చిందని స్పష్టం చేశారు.

సీనియర్ నేత జానారెడ్డిపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ధర్మరాజులా వ్యవహరించాల్సిన వారు ధృతరాష్ట్రుడిలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. 30 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసిన జానారెడ్డి, ఇప్పుడే రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు పదవులు ఇవ్వాలని గుర్తుకు తెచ్చుకున్నారంటూ సెటైర్లు వేశారు.

తమ్ముడికి మంత్రి పదవి ఇవ్వకూడదా?

రాజగోపాల్ రెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పటికే మంత్రి పదవిలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ్ముడిగా తనకు మంత్రి పదవి రావడం సహజమేనని, దీనిపై ఎవరు రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు. తనకు కూడా పదవి రావాల్సిన హక్కు ఉందన్నారు. తాను పదవుల కోసం యాచించేవాడిని కాదని, పార్టీలో చేసిన సేవలు చూస్తే సహజంగానే తనకు మంత్రి పదవి రావాలి అన్నారు. “అది అడుగుతో వచ్చినది కాదు, నా వంతు న్యాయంగా రావాల్సినది” అని స్పష్టం చేశారు. ఏవిధంగా కాంగ్రెస్ గెలిచిందో అందరికి తెలుసని, తాను చేస్తున్న పోరాటం వల్లే కాంగ్రెస్ తిరిగి బలపడిందని అభిప్రాయపడ్డారు. మంత్రివర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి రావడాన్ని కొంతమంది కావాలనే అడ్డుకుంటున్నారని రాజగోపాల్ ఆరోపించారు. పార్టీకి వెన్ను పొడిచే విధంగా వ్యవహరించే వారిని అధిష్ఠానం పట్టించుకోవాలని సూచించారు. పార్టీకి సేవ చేసే వారికి పదవులు రావాలి, పదవుల కోసమే రాజకీయం చేసేవారికి కాదు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి, తనకున్న అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించారు. పార్టీ అంతర్గత వ్యవహారాలను పక్కనపెట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో తాను పోరాడతానన్నారు.

#CONGRESS #Komatireddy #MinisterPost #PoliticalControversy #RajagopalReddy #telangana Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.