हिन्दी | Epaper
అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్

Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Sharanya
Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణకు సిద్ధమవుతుండగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తనకు మంత్రి పదవి ఖాయమని, కాంగ్రెస్ అధిష్ఠానం ఆ మేరకు హామీ ఇచ్చిందని స్పష్టం చేశారు.

సీనియర్ నేత జానారెడ్డిపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ధర్మరాజులా వ్యవహరించాల్సిన వారు ధృతరాష్ట్రుడిలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. 30 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసిన జానారెడ్డి, ఇప్పుడే రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు పదవులు ఇవ్వాలని గుర్తుకు తెచ్చుకున్నారంటూ సెటైర్లు వేశారు.

తమ్ముడికి మంత్రి పదవి ఇవ్వకూడదా?

రాజగోపాల్ రెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పటికే మంత్రి పదవిలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ్ముడిగా తనకు మంత్రి పదవి రావడం సహజమేనని, దీనిపై ఎవరు రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు. తనకు కూడా పదవి రావాల్సిన హక్కు ఉందన్నారు. తాను పదవుల కోసం యాచించేవాడిని కాదని, పార్టీలో చేసిన సేవలు చూస్తే సహజంగానే తనకు మంత్రి పదవి రావాలి అన్నారు. “అది అడుగుతో వచ్చినది కాదు, నా వంతు న్యాయంగా రావాల్సినది” అని స్పష్టం చేశారు. ఏవిధంగా కాంగ్రెస్ గెలిచిందో అందరికి తెలుసని, తాను చేస్తున్న పోరాటం వల్లే కాంగ్రెస్ తిరిగి బలపడిందని అభిప్రాయపడ్డారు. మంత్రివర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి రావడాన్ని కొంతమంది కావాలనే అడ్డుకుంటున్నారని రాజగోపాల్ ఆరోపించారు. పార్టీకి వెన్ను పొడిచే విధంగా వ్యవహరించే వారిని అధిష్ఠానం పట్టించుకోవాలని సూచించారు. పార్టీకి సేవ చేసే వారికి పదవులు రావాలి, పదవుల కోసమే రాజకీయం చేసేవారికి కాదు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి, తనకున్న అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించారు. పార్టీ అంతర్గత వ్యవహారాలను పక్కనపెట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో తాను పోరాడతానన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870