హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ హైకమాండ్ ఆదేశిస్తే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని ఆయన ఇప్పటికే ప్రకటించారు. తాజాగా తన నిర్ణయం గురించి మరోసారి స్పందించారు.రాజాసింగ్ మాట్లాడుతూ, తన రాజీనామా (Resignation) వెనుక ఎలాంటి కుట్ర లేదని స్పష్టం చేశారు. ఎవరి వల్ల పార్టీకి నష్టం జరిగిందో ఆ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం మాత్రమే చేశానని చెప్పారు. Telangana లో బీజేపీ బలపడాలంటే కఠినమైన నిర్ణయాలు అవసరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
కార్యకర్తల త్యాగం గుర్తుచేసిన ఎమ్మెల్యే
రాజాసింగ్ మాట్లాడుతూ, లక్షలాది కార్యకర్తలు బీజేపీ కోసం త్యాగం చేశారని గుర్తు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఒక యోధుడు అవసరమని అన్నారు. పార్టీ బలోపేతం కోసం తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని తెలిపారు.కేంద్రమంత్రి అమిత్ షా తనకు కాల్ చేశారన్న ప్రచారం నిజం కాదని రాజాసింగ్ స్పష్టం చేశారు. “అమిత్ షా ఫోన్ చేసేంతటి పెద్దవాడిని నేను కాదు” అని స్పష్టంగా చెప్పారు.
తిరిగి బీజేపీలో చేరే ప్రయత్నం లేదన్న ఎమ్మెల్యే
తాను మళ్లీ బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నానని వస్తున్న వార్తలు అసత్యమని ఆయన అన్నారు. కార్యకర్తల బృందాన్ని రాష్ట్ర కార్యాలయానికి పంపానన్న వార్తలు కూడా వాస్తవం కాదని పేర్కొన్నారు.తాను అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతే రాజీనామా చేశానని రాజాసింగ్ చెప్పారు. పార్టీ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని, వ్యక్తిగత లాభం తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
Read Also : KTR : సీఎం రమేశ్ ఆరోపణలపై స్పందించిన కేటీఆర్