Raj Bhavan renamed : తెలంగాణ గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్ భవన్కు కొత్త పేరు పెట్టారు. హైదరాబాద్లోని రాజ్ భవన్ను ఇకపై ‘లోక్ భవన్’గా పిలుస్తామని మంగళవారం గవర్నర్ కార్యాలయం ప్రకటించింది.
ఈ పేరు మార్పు ప్రజాస్వామ్య విలువల బలాన్ని, చైతన్యాన్ని ప్రతిబింబించేందుకే చేపట్టిన నిర్ణయమని గవర్నర్ కార్యాలయం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొంది. వికసిత్ భారత్ లక్ష్యంగా ధైర్యంగా ముందుకు సాగుతున్న తరుణంలో, ప్రజల భాగస్వామ్యాన్ని హైలైట్ చేసేందుకు ఈ మార్పు చేసినట్లు వెల్లడించింది.
Latest News: Bandi Sanjay: రేవంత్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఫైరింగ్
‘లోక్ భవన్, తెలంగాణ’ అనే కొత్త నామకరణం వెంటనే అమల్లోకి వస్తుందని, ఇకపై అన్ని ప్రభుత్వ కార్యకలాపాలు, అధికారిక సూచనలు, (Raj Bhavan renamed) రికార్డుల్లో ఇదే పేరు ఉపయోగించబడుతుందని గవర్నర్ కార్యాలయం స్పష్టం చేసింది.
రాజ్ భవన్ పేరు మారిన వెంటనే, గవర్నర్ అధికారిక నివాసం మరియు కార్యాలయం ముందు ఉన్న బోర్డులు ‘లోక్ భవన్’ పేరుతో మార్చారు. అంతేకాదు, ఇకపై అధికారిక లెటర్హెడ్స్, ఇతర ప్రభుత్వ ఫార్మాట్లలో కూడా ‘లోక్ భవన్’ అనే పేరు మాత్రమే వినియోగించబడనుందని అధికారులు తెలిపారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/