📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

KTR Fire : రాజ్యాంగానికి రాహుల్, రేవంత్ తూట్లు – KTR

Author Icon By Sudheer
Updated: January 15, 2026 • 10:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాలె యాదయ్య మరియు పోచారం శ్రీనివాస్ రెడ్డిలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్‌చిట్ ఇవ్వడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీ మారిన విషయం జగమెరిగిన సత్యమని, స్వయంగా వారే కండువాలు కప్పుకున్నా ఆధారాలు లేవనడం విడ్డూరంగా ఉందంటూ ఆయన విమర్శలు గుప్పించారు.

Talasani : తలసానిపై కేసు.. వివాదం ఏంటి?

కేటీఆర్ తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు కోటి సాక్ష్యాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. బహిరంగంగానే వారు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఉన్నప్పటికీ, సాంకేతిక కారణాలు చూపుతూ ఫిర్యాదులను కొట్టివేయడం పవిత్రమైన శాసనసభను అవమానించడమే అని ఆయన మండిపడ్డారు. ఇది కేవలం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే కాకుండా, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయడమేనని కేటీఆర్ ఆరోపించారు.

KTR news

ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. దేశంలో రాజ్యాంగాన్ని కాపాడతామని చెప్పే రాహుల్ గాంధీ, తెలంగాణలో మాత్రం ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారని, పార్టీ మారిన ‘జంప్ జిలానీలకు’, ప్రభుత్వానికి బుద్ధి చెప్పే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. న్యాయ పోరాటంతో పాటు ప్రజల పక్షాన ఈ అక్రమాలను ఎండగడతామని కేటీఆర్ పునరుద్ఘాటించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Google News in Telugu ktr rahul revanth Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.