తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ రాసిన లేఖ సామాజిక న్యాయం మరియు విద్యా సంస్థలలో కొనసాగుతున్న వివక్షపూరిత వ్యవస్థలపై లోతైన ఆలోచనకు ఆహ్వానం పలికే విధంగా ఉంది. ఈ లేఖలో ఆయన ‘రోహిత్ వేముల చట్టం’ పేరుతో ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని సూచించడం గమనార్హం. ఇది కేవలం ఒక ప్రతిపాదన మాత్రమే కాదు, సామాజిక సమానత్వం కోసం సాగించే దీర్ఘకాలిక పోరాటానికి ఒక కీలక మలుపు కావచ్చు.

రోహిత్ వేముల –
2016 జనవరిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య తనకాలంలో విద్యార్థి ఉద్యమాల్లో పెద్దదిగానూ, దళిత హక్కుల పోరాటానికి ప్రతీకగా మారింది. అతని సూసైడ్ నోట్లో వర్ణ వివక్ష, తక్కువ ప్రాతినిధ్యం ఉన్న వర్గాల పట్ల ఉన్న వ్యవస్థాపిత వివక్షను పగడ్బందీగా వ్యక్తపరిచాడు. ఇది దేశవ్యాప్తంగా సంచలనాన్ని రేపింది. అప్పటి నుంచి దళిత విద్యార్థులు, సామాజిక న్యాయ కార్యకర్తలు, రాజకీయ నాయకులు ఈ అంశంపై చట్టపరంగా మార్పులు కోరుతూ ఉద్యమించారన్నారు.
రాహుల్ గాంధీ లేఖ
రాహుల్ గాంధీ తన లేఖలో రోహిత్ వేముల, పాయల్ తడ్వి, దర్శన్ సోలంకి వంటి యువతీయువకుల మరణాల్ని గుర్తుచేశారు. వారు తాము ఎదుర్కొంటున్న సామాజిక వివక్షకు నిరోధించలేక, మనోవేదనతో జీవితం ముగించుకున్నారని పేర్కొన్నారు. డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్, రోహిత్ వేములతో పాటు లక్షలాది మంది ఎదుర్కొన్న వివక్షను ఇతరులు ఎదుర్కోకుండా ఉండేందుకు ‘రోహిత్ వేముల’ చట్టాన్ని తీసుకురావాలని సూచించారు.
కర్ణాటక సీఎంకు కూడా లేఖ
ఇది కేవలం తెలంగాణకే పరిమితమైన అంశం కాదు. రెండు రోజుల క్రితం రాహుల్ గాంధీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకూ ఇలాంటి లేఖనే పంపారు. విద్యా వ్యవస్థలో సమానత్వం కల్పించడానికి దేశవ్యాప్తంగా ఒక ప్రామాణిక చట్టం అవసరమని ఆయన అభిప్రాయం.
Read also: Telangana: డ్రైవింగ్ లైసెన్స్ మరింత సులభంగా రెన్యువల్