📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Phone Tapping Case : ముగిసిన ప్రణీత్ రావు విచారణ

Author Icon By Sudheer
Updated: June 21, 2025 • 6:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబీ (SIB) మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు (Pranith Rao) విచారణ ముగిసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) అధికారులు ఈరోజు దాదాపు ఐదు గంటల పాటు ఆయనను విచారించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితుల వాంగ్మూలాలను పరిశీలించిన అనంతరం, వాటి ఆధారంగా ప్రణీత్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. గతంలోనూ జూన్ 13, 18 తేదీల్లో ప్రణీత్ రావును అధికారులు విచారించిన సంగతి తెలిసిందే.

ఎవరి ఆదేశాలపై ట్యాపింగ్?

విచారణలో ముఖ్యంగా “ఎవరి ఆదేశాల మేరకు ఫోన్లు ట్యాప్ చేశారో?” అనే అంశంపై సిట్ అధికారులు ప్రణీత్‌ను గట్టిగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ట్యాపింగ్ వెనుక ఉన్న అసలు మర్మం తెలుసుకునేందుకు ప్రయత్నించిన సిట్, ప్రణీత్ నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు సమాచారం. ఈ కేసులో ఎవరి పాత్ర ఎంత వరకు ఉందో నిర్ధారించేందుకు అనేక కోణాల్లో విచారణ సాగించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారన్న దానిపై దృష్టి

ఈ కేసులో అసలు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయన్న అంశంపైనా సిట్ దృష్టి పెట్టింది. రాజకీయ నేతలు, ఉద్యోగులు, జర్నలిస్టుల ఫోన్లను లక్ష్యంగా చేసారా? అనే కోణంలో విచారణ కొనసాగించినట్లు తెలుస్తోంది. ఇది ఒకవ్యక్తిగత చర్యా? లేక రాజకీయ నాయ‌కుల ప్రమేయం ఉన్న వ్యవహారమా? అనే దానిపై స్పష్టత తీసుకురావడానికి అధికారులు మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. త్వరలోనే ఈ కేసులో మరిన్ని కీలక మలుపులు వచ్చే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also : Sonia Gandhi: న‌రమేధం పట్ల భార‌త్ మౌనంగా వీడాలి .. సోనియా

Google News in Telugu Phone Tapping Case Praneeth Rao's trial ends pranith rao

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.