📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Breaking News – Praja Palana Festivals : డిసెంబర్ 1 నుంచి ప్రజాపాలన ఉత్సవాలు.. కొత్త అప్లికేషన్ల స్వీకరణ

Author Icon By Sudheer
Updated: October 16, 2025 • 10:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ 1 నుంచి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా “ప్రజాపాలన–ప్రజా విజయోత్సవాలు” నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ వేడుకల ద్వారా ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు పరిచయం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా, గ్రామాల నుండి పట్టణాల దాకా ప్రతి స్థాయిలో ప్రజా భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాలు జరగనున్నాయి.

Latest Telugu News: Bhupendra Patel: గుజరాత్‌లో కీలక పరిణామం…మంత్రులంతా రాజీనామా!

ప్రజావిజయోత్సవాల సమయంలో పలు ముఖ్యమైన సంక్షేమ పథకాలకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమాల్లో ఇందిరమ్మ ఇల్లు పథకం, చేకు బంధు, మహిళా శక్తి యోజన, యువ నేస్తం, ఆరోగ్య శ్రీ వంటి పథకాలకు అప్లికేషన్లు స్వీకరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏ పథకాలకు దరఖాస్తులు తీసుకోవాలో, ఏ విధంగా ప్రక్రియను సులభతరం చేయాలో అనే అంశంపై రెండు రోజుల్లోనే ముఖ్య కార్యదర్శి (CS) అధ్యక్షతన జరిగే సమీక్షా సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్సవాలను కేవలం విజయోత్సవాలుగా కాకుండా ప్రజల సమస్యలను తెలుసుకునే వేదికగా ఉపయోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి జిల్లా, మండల స్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ప్రత్యక్షంగా ప్రజలతో మమేకమవ్వనున్నారు. ప్రజలు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై అభిప్రాయాలు, సూచనలు చెప్పడానికి కూడా అవకాశం కల్పించనున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం మరింత బలపడుతుందని, ప్రజాసేవే తమ ధ్యేయమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలిసింది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

 

cm revanth Google News in Telugu Latest News in Telugu Praja Palana Festivals prajapalana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.