📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Ponnam Prabhakar: కేటీఆర్ పై పొన్నం ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు

Author Icon By Sharanya
Updated: April 13, 2025 • 2:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో కంచ గచ్చిబౌలి భూముల వివాదం రాజకీయంగా మళ్లీ చర్చనీయాంశమైంది. ఈ వివాదానికి సంబంధించి బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయగా, తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ వాటిపై ఘాటుగా స్పందించారు. మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలు అర్థరహితమని కొట్టిపారేశారు. కేటీఆర్ మాట్లాడేది ఆయనకే అర్థం కావడం లేదని అన్నారు.

పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ

పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన ఆరోపణలను పూర్తిగా తిప్పికొట్టారు. కేటీఆర్ మాట్లాడేది ఆయనకే అర్థం కాదు. వాస్తవాలు తెలియకుండానే గాలికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పారదర్శకంగా ఉన్నాయి, అని వ్యాఖ్యానించారు. మంత్రి పొన్నం ఎద్దేవా చేస్తూ, కేటీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారు. కానీ ప్రజలు అధికారాన్ని ఎవరికీ అప్పగించాలో బాగా తెలుసు. ప్రజల నాడి తెలుసుకోలేని బీఆర్ఎస్ నేతలకు భవిష్యత్తు లేదు, అని చెప్పారు. గచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని బీజేపీ ఎంపీ అజ్ఞాతంగా నడిపిస్తున్నారని కేటీఆర్ చేసిన ఆరోపణలపై మంత్రి పొన్నం తీవ్రంగా స్పందించారు. ఆ ఎంపీ పేరు చెప్పే దమ్ము, ధైర్యం లేదా అని కేటీఆర్ ను ప్రశ్నించారు. బీజేపీ నేతలు అవివేకంతో ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం విమర్శించారు. సీఎం మార్పుపై ప్రకటనలు చేస్తూ వారి అవివేకాన్ని బయటపెట్టుకుంటున్నారని అన్నారు. ఒకవేళ సీఎంను మార్చాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇ‌న్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్ ఎప్పుడో ప్రకటన చేసేవారని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. కానీ ఇవన్నీ ప్రచార గోలే తప్ప నిజం కాదు, అని అన్నారు. పట్టణాభివృద్ధి, పౌరసదుపాయాలు, భూ వినియోగంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది. అయితే ప్రతిపక్షాలకి ఇది జీర్ణించుకోలేని విషయం,” అని తెలిపారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న ఆరోపణలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచ్చిన స్పందన రాజకీయ వేడి పెంచేలా ఉంది.

Read also: Revanth Reddy : భూభారతిపై రేవంత్ రెడ్డి సమీక్ష!

#bjp #CongressVsBRS #GachibowliLands #Hyderabad #ktr #ponnamprabhakar #RevanthReddy #TelanganaPolitics Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.