బిసి గురుకుల అధికారుల సమీక్షలో మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ : రాష్ట్రంలో బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బిసి
గురుకులాల్లో ఏ సంఘటన జరిగినా అందుకు అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని, బిసి సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) స్పష్టం చేశారు. గురుకులాల్లో చదువుతున్న విద్యా ర్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. బిసి గురుకుల సొసైటీ అధికారులతో మంత్రి పాన్నం శుక్రవారం జూమ్ మీటింగ్లో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో బిసి సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీధర్, గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులుతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 327 బీసి గురుకులాల ప్రిన్సిపాల్లు, ఆర్సీఓలతో పాటు ఇతర అధికారులు జూమ్ సమావేశం (Zoom meeting) లో పాల్గొన్నారు. ఇటీవల గురుకులాల్లో జరుగుతున్న వరుస సంఘటనలపై మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు.

పోషకాలతో పాష్టికాహారం
అర్సిఓలు విధిగా గురుకులాలు తనిఖీలు చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రిన్సిపాల్లు, టీచర్లు పిల్లలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు పై అధికారుల దృష్టికీ తీసుకురావాలని సూచించారు. పిల్లలకు నాణ్యమైన ఆహార అందించడంలో రాజీపడద్దన్నారు. ఎవరైనా నిరక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మంద్రా హెచ్చరించారు. పిల్లలకు పోషకాలతో పాష్టికాహారం (Vegetarian food) అందించడం కోసం ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచింది. గుర్తు చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలన్నారు. అలాగే పాఠశాలలో శుభ్రత పాటి చాలని ఆదేశించిన మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించాల సూచించారు.
పొన్నం ప్రభాకర్ ఏ నియోజకవర్గానికి చెందినవారు?
ఆయన కరీంనగర్ లోక్సభ నియోజకవర్గానికి చెందినవారు.
పొన్నం ప్రభాకర్ రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు?
పొన్నం ప్రభాకర్ 2009లో మొదటిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన విద్యార్థి నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Minister Seethakka: మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కృషి