📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Ponnam Prabhakar: పట్టణం చుట్టూ రింగు రోడ్డుతో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు

Author Icon By Rajitha
Updated: February 9, 2026 • 3:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కరీంనగర్ పట్టణం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణంతో నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు తొలగిపోనున్నాయి. ఈ అంశంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే రింగ్ రోడ్డు నిర్మాణానికి హామీ ఇచ్చారని తెలిపారు. పట్టణంలో రోజురోజుకీ పెరుగుతున్న వాహన రద్దీకి ఇది శాశ్వత పరిష్కారమని చెప్పారు. రింగ్ రోడ్డు వల్ల భారీ వాహనాలు నగరం బయటుగా వెళ్లే అవకాశం కలుగుతుందని వివరించారు. దీని ద్వారా సమయంతో పాటు ఇంధన ఖర్చు కూడా తగ్గుతుందని మంత్రి పేర్కొన్నారు.

Read also: TG Crime: మహిళా ఫిజియోథెరపీస్ట్‌ ఆత్మహత్య

Traffic problems will be resolved

కాంగ్రెస్ పాలనలోనే కరీంనగర్ అభివృద్ధి: పొన్నం ప్రభాకర్

బీఆర్ఎస్, బీజేపీ పాలనల కారణంగానే కరీంనగర్ పట్టణం అభివృద్ధిలో వెనుకబడిపోయిందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకెళ్తోందన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి పేదలకు గూడు కల్పించామని తెలిపారు. గత ప్రభుత్వాలు ఇవ్వని రేషన్ కార్డులను అర్హులందరికీ అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో మాత్రమే తినదగిన సన్నబియ్యం పంపిణీ జరుగుతోందని గుర్తు చేశారు.

సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల్లా ముందుకు: మంత్రి హామీ

80 శాతం మందికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందుతోందని మంత్రి తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అమలు చేస్తున్నామన్నారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ కోసం రూ.21 వేల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. 70 వేలకుపైగా ఉద్యోగాల భర్తీతో యువతకు ఉపాధి కల్పించామని చెప్పారు. కరీంనగర్ డంపింగ్ యార్డుకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని, భవిష్యత్తులో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, పార్కులు అన్నీ సమగ్ర ప్రణాళికతో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Karimnagar ring road Karimnagar traffic problem latest news Ponnam Prabhakar speech Telangana Development Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.