తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో నిత్యం కొత్తకొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిట్ దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు 1000 మందికి పైగా రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ అయినట్లు అధికారికంగా గుర్తించబడింది. ఇది కేవలం వ్యక్తిగత గోప్యతకే కాకుండా, ప్రజాస్వామ్య విలువలకు కూడా పెద్ద దెబ్బ అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణలో 650 మంది కాంగ్రెస్ నేతలే లక్ష్యంగా
సిట్ అధికారులు ప్రాథమికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం, ట్యాపింగ్ వ్యవహారం ప్రధానంగా 2018 నుంచి 2023 మధ్య కాలంలో కొనసాగిందని గుర్తించారు. ఇందులో తెలంగాణకు చెందిన 650 మంది కాంగ్రెస్ నాయకులు టార్గెట్ చేయబడ్డారు. అలాగే ఆంధ్రప్రదేశ్కి చెందిన పలువురు కీలక రాజకీయ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు సమాచారం. ఇందుకోసం సాంకేతిక నిపుణుల సహాయంతో కొన్ని గోప్యమైన యంత్రాల్ని వినియోగించినట్లు తెలుస్తోంది.
ఇంకా కీలక నేతల విచారణ కొనసాగుతోంది
ఈ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే ఒకరిని అరెస్ట్ చేసిన సిట్, ఈ రోజు మరికొంత మంది కీలక అధికారుల్ని విచారిస్తోంది. ఫోన్ల ట్యాపింగ్ చేసిన విధానం, ఆదేశాలు ఎవరిచ్చారు? ఎవరి నియంత్రణలో ఇది జరిగింది? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. గత ప్రభుత్వంలో ఉన్న కొందరి పెద్దలపై ఈ కేసు పరిుణామాలు దిశానిర్దేశం చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also : muscle pain: కండరాల నొప్పికి పలు కారణాలు..అవేంటో తెలుసా?