తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్గా మారిన నేపథ్యంలో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్నటి సిట్ విచారణలో ఫోన్ ట్యాపింగ్ జరగలేదని మాజీ సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్పారని ఆయన తెలిపారు. చట్టంపై గౌరవంతోనే కేసీఆర్ విచారణకు హాజరయ్యారని, అవసరం లేకపోయినా బాధ్యతగా స్పందించారన్నారు. ఈ అంశాన్ని వక్రీకరించకుండా వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత అందరికీ ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Read also: HighSpeed Train: హైదరాబాద్–వరంగల్కు నమో భారత్ ర్యాపిడ్ రైలు

KTR counters Sajjanar’s tweet.
సజ్జనార్ ట్వీట్పై కేటీఆర్ కౌంటర్
అక్రమ ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ సజ్జనార్ చేసిన ట్వీట్పై కేటీఆర్ (KTR) తీవ్రంగా స్పందించారు. సజ్జనార్ న్యాయమూర్తి కాదని, కేవలం ఓ పోలీసు అధికారి మాత్రమేనని స్పష్టం చేశారు. ఎవరికైనా ఫోన్ ట్యాపింగ్ చట్టవిరుద్ధంగా జరిగిందని అనిపిస్తే, సోషల్ మీడియా కాదు కోర్టును ఆశ్రయించాల్సిందేనని ప్రశ్నించారు. ప్రజల్లో గందరగోళం సృష్టించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని కేటీఆర్ అన్నారు.
న్యాయపరమైన మార్గమే సరైనదన్న కేటీఆర్
దేశంలో న్యాయ వ్యవస్థ బలంగా ఉందని, చట్ట విరుద్ధమైన చర్యలు జరిగితే కోర్టులు నిర్ణయం తీసుకుంటాయని కేటీఆర్ గుర్తు చేశారు. రాజకీయ ఉద్దేశాలతో ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్యానికి హానికరమని చెప్పారు. వాస్తవాలు, ఆధారాలతోనే మాట్లాడాలని హితవు పలికారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో కూడా చట్టమే తుది తీర్పు చెప్పాలన్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్పష్టతతో ఉందని కేటీఆర్ తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: