42 Percent Reservations : బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై సుప్రీంలో పిటిషన్

Read Time:  1 min
42 Percent Reservations : బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై సుప్రీంలో పిటిషన్
FONT SIZE
GET APP

తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు (42 Percent Reservations) కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయం చట్టపరమైన వివాదానికి దారితీసింది. గోపాలరెడ్డి అనే వ్యక్తి ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌లో రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘాన్ని ప్రతివాదులుగా చేర్చారు. రిజర్వేషన్లు 50% మించకూడదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఆధారంగా చూపుతూ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగానికి విరుద్ధమని పిటిషన్ పేర్కొంది.

Latest News: Bigg Boos 9: ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరంటే?

ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎల్లుండి విచారణ జరపనుంది . రాష్ట్రంలో రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంలో బీసీ రిజర్వేషన్ల పెంపుపై సర్వత్రా చర్చ జరుగుతున్న వేళ, ఈ పిటిషన్ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. పిటిషనర్ వాదన ప్రకారం, ఓటు హక్కుల సమానత్వాన్ని, ఇతర వర్గాల ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని న్యాయస్థానం దృష్టి సారించాలంటున్నారు. ఇదే సమయంలో, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాజిక న్యాయం కోసం తీసుకున్నదని సర్కారు వర్గాలు చెబుతున్నాయి.

అదే సమయంలో, రిజర్వేషన్లపై హైకోర్టులో కూడా ఇప్పటికే విచారణ జరుగుతోంది. ఈ నెల 8న హైకోర్టు ఈ అంశంపై తీర్పు ఇవ్వనుంది. హైకోర్టు తీర్పు తర్వాత సుప్రీంకోర్టు విచారణకు దిశా నిర్ధేశం అవుతుందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశం మళ్లీ కేంద్రస్థానంగా మారి, రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీస్తోంది. ఈ కేసు తీర్పు రాబోయే స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అంటున్నారు.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.