📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

15 నెలల కాంగ్రెస్ పాలన చూసి ప్రజలకు విసుగు – కేటీఆర్

Author Icon By Sudheer
Updated: February 25, 2025 • 4:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, 15 నెలల పాలనతోనే విసుగు చెంది పోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో అభివృద్ధి పూర్తిగా స్తంభించిందని, ప్రజా సమస్యలు పెరిగిపోతున్నాయని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి 35 సార్లు ఢిల్లీ వెళ్లి ఏం సాధించారు? అని ప్రశ్నించారు. ఇప్పుడూ మళ్లీ హస్తిన వెళ్లి ప్రజల సమస్యలపై చర్యలు తీసుకోకుండా రాజకీయ లబ్ధి కోసమే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయం

రాష్ట్రంలోని రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. గత 48 గంటల్లో ఏకంగా ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, కానీ ప్రభుత్వం వాటిపై స్పందించలేదని విమర్శించారు. SLBC కాలువలో ఎనిమిది మంది ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే, ముఖ్యమంత్రి మాత్రం ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారని ఆయన ఆరోపించారు. రైతుల సమస్యలు, నీటి సౌకర్యాల అభివృద్ధి పూర్తిగా పట్టించుకోకుండా, పబ్లిసిటీ కోసం పాలనను గాలికొదిలేశారని మండిపడ్డారు.

తెలంగాణలో అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలోనే

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు బహిరంగంగా అర్థమయ్యాయని, త్వరలోనే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలోనే సాధ్యమవుతుందని, ప్రజలు మళ్లీ తమ పార్టీ వైపు మొగ్గుచూపే పరిస్థితి త్వరలోనే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రైతు సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగాల కల్పన వంటి అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Congress rule Google news ktr

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.