తెలంగాణలో విద్యా రంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ (PDSU) రెండు రోజుల బంద్కు పిలుపునిచ్చింది. రేపు (జూలై 3) మరియు ఎల్లుండి (జూలై 4) రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్ మరియు డిగ్రీ కాలేజీలు బంద్ (Engineering and Degree Colleges ) చేయాలని యూనియన్ నేతలు పిలుపునిచ్చారు. విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆరోపిస్తూ, విద్యా రంగంలోని సమస్యలను ఎత్తిచూపేందుకు ఈ నిరసన చేపట్టామని తెలిపారు.
రూ.8వేల కోట్లు బకాయిలు -స్కాలర్షిప్, రీయింబర్స్మెంట్ లేక విద్యార్థులు ఇబ్బందులు
PDSU వాదన ప్రకారం, ప్రస్తుతం విద్యా రంగానికి సంబంధించిన రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ బకాయిలు రూ.8వేల కోట్ల వరకు చేరాయని పేర్కొంది. ఈ బకాయిల వల్ల అనేక మంది విద్యార్థులు తమ చదువులను కొనసాగించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా ప్రైవేట్ కాలేజీల్లో చదువుతున్న పేద విద్యార్థులు ఫీజులు చెల్లించలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారని యూనియన్ పేర్కొంది.
ప్రభుత్వం తక్షణమే స్పందించాలి – లేకపోతే ఉద్యమం ఉధృతం
విద్యార్థులకు న్యాయం చేయాలంటే ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయిలను చెల్లించాలని పీడీఎస్యూ డిమాండ్ చేసింది. లేకపోతే విద్యార్థి సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉగ్రతతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని హెచ్చరించింది. విద్యార్థుల భవిష్యత్తును అణగదొక్కే ఈ విధానాన్ని తాము ఏమాత్రం సహించబోమని స్పష్టం చేసింది.
Read Also : Cinnamon: దాల్చిన చెక్కతో చిన్నచిన్న జబ్బులు పరార్