Patancheru Rudraram Road Accident: పటాన్‌చెరులో మూడు బస్సులు ఒకదానికొకటి ఢీ

Read Time:  1 min
Patancheru Rudraram Road Accident
Patancheru Rudraram Road Accident
FONT SIZE
GET APP

Patancheru Rudraram Road Accident: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలో శనివారం మధ్యాహ్నం భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రుద్రారం గ్రామం వద్ద ముంబై జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న మూడు బస్సులు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంతో హైవేపై ఒక్కసారిగా కలకలం రేగింది.

Read Also: Tirupati Road Accident: తిరుపతి నగరంలో గరుడ ఫ్లై ఓవర్ పై రోడ్డు ప్రమాదం.

ప్రమాదం జరిగిందిలా..

రుద్రారం బస్టాప్ వద్ద ఒక బస్సు ప్రయాణికులను ఎక్కించుకుంటున్న క్రమంలో వెనుక నుంచి వస్తున్న మరో ఆర్టీసీ బస్సు, దాని వెనుక ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నియంత్రణ కోల్పోయి ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ క్రమంలో రెండు ఆర్టీసీ బస్సులు మరియు ఒక ప్రైవేట్ బస్సు దెబ్బతిన్నాయి.

Patancheru Rudraram Road Accident
Three buses collided with each other in Patancheru

Patancheru Rudraram Road Accident: ప్రయాణికులకు గాయాలు – స్తంభించిన ట్రాఫిక్

బస్సులు బలంగా ఢీకొనడంతో లోపల ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా కిందపడిపోయారు. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా ముంబై జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు క్రేన్ల సహాయంతో బస్సులను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు.

hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Siva Prasad

రచయిత గురించి

Siva Prasad

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.