తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. బీఆర్ఎస్ కీలక నేత కవిత తన సొంత రాజకీయ పార్టీని ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. రాబోయే శ్రీరామనవమి పండుగ తర్వాత తన కొత్త పార్టీ పేరు, విధివిధానాలను వెల్లడిస్తానని ఆమె స్పష్టం చేశారు. కేవలం పార్టీ ప్రకటించడమే కాకుండా, మహాత్మా గాంధీ ప్రబోధించిన ‘సర్వోదయ సిద్ధాంతాన్ని’ తాను లోతుగా అధ్యయనం చేస్తున్నానని, అదే అజెండాతో ప్రజల్లోకి వెళ్తానని ఆమె తెలిపారు. సామాజిక సమానత్వం, అట్టడుగు వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తన రాజకీయ ప్రయాణం సాగుతుందని ఆమె పేర్కొనడం విశేషం.
కవిత తన రాజకీయ ప్రత్యర్థులపై ఘాటైన విమర్శలు చేశారు. తన పోరాటం ప్రధానంగా “డాడీ (కేసీఆర్), మోదీ (ప్రధాని), మరియు చిన్న మోదీ (రేవంత్ రెడ్డి)” పైనే ఉంటుందని ఆమె బాంబు పేల్చారు. బీఆర్ఎస్ పార్టీతో తనకు ఉన్న అంతర్గత విభేదాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆమె ఆరోపించారు. ఒకవైపు కుటుంబ రాజకీయాలకు, మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా తృతీయ ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ఆమె వ్యూహాలు రచిస్తున్నారు. ఈ ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యే అవకాశం ఉంది.
Read Also : China Toilet Goddess Zigu: చైనాలో వింత సంప్రదాయం…మరుగుదొడ్డిని పూజిస్తున్న ప్రజలు!
పార్టీ ప్రకటనకు ముందే కవిత తనదైన శైలిలో ‘జాగృతి ప్రజాబడ్జెట్’ ను ప్రతిపాదించారు. ఈ ఏడాది సుమారు రూ.2.23 లక్షల కోట్లతో ప్రజల కోసం ఒక ప్రత్యామ్నాయ బడ్జెట్ ప్రణాళికను సిద్ధం చేసినట్లు ఆమె వెల్లడించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్కు దీటుగా, ప్రజల అవసరాలను ప్రతిబింబించేలా ఈ ప్రతిపాదనలు ఉంటాయని ఆమె తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉండగా, కవిత కొత్త పార్టీతో ఈ పోటీ చతుర్ముఖంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం అటు బీఆర్ఎస్ పార్టీలోనూ, ఇటు అధికార కాంగ్రెస్ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :